News January 24, 2025

గ్రామసభల్లో పోలీసుల బందోబస్తు: జిల్లా ఎస్పీ

image

చివ్వెంల మండల పరిధిలోని మున్యానాయక్ తండాలో గ్రామసభలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ గురువారం పరిశీలించారు. గ్రామసభ నిర్వహణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభ కార్యక్రమాలలో భాగస్వామ్యమై పోలీసు బందోబస్తు కల్పిస్తున్నా మన్నారు. గ్రామ సభలో పాల్గొన్న ప్రజలతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవి, సీఐ రాజశేఖర్ ఉన్నారు.

Similar News

News November 27, 2025

‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్‌పై కామెంట్స్.. SRనగర్‌లో ఫిర్యాదు

image

సింగర్ మంగ్లీ తన తాజా పాట ‘బాయిలోనే బల్లి పలికే’పై జనాదరణ పొందింది. అటువంటి పాట మీద ఓ వ్యక్తి అసభ్యకరంగా, కించపరిచే విధంగా కామెంట్స్ చేశాడంటూ SRనగర్ PSలో ఆమె ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి తన పాటనే కాకుండా, జాతిని ఉద్దేశిస్తూ నీచంగా మాట్లాడారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఓ వర్గాన్ని కించపరిచిన ఆ వ్యక్తిని శిక్షించాలని పోలీసులను మరోవైపు కొందరు నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నాయి.

News November 27, 2025

NIT వరంగల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

image

<>NIT <<>>వరంగల్‌ 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి ఎంఏ (ఫ్రెంచ్, జర్మన్), పీహెచ్‌డీ ఉత్తీర్ణులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/

News November 27, 2025

2 జిల్లాల్లో నియోజకవర్గం.. తొలిదశలోనే పోలింగ్..!

image

రెండు జిల్లాలలో విస్తరించి ఉన్న వేములవాడ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు తొలి విడతలో ఒకేసారి జరగనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 మండలాల్లో 85, జగిత్యాల జిల్లాలో 3 మండలాల్లో 44 పంచాయతీలు ఉండగా, నేటి నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, డిసెంబర్ 3న ఉపసంహరణ అనంతరం 11న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లోనూ ఒకే దశలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.