News January 24, 2025
ఎస్జిఎఫ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు నామాపూర్ విద్యార్థిని ఎంపిక

ముస్తాబాద్ మండలం నామాపూర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల 8వ తరగతి విద్యార్థిని గూడెపు వంశిక ఈనెల 22 నుండి భద్రాచలంలో జరిగే రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు కుంట శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి పోటీల్లో అండర్ 17 క్రికెట్ సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వంశిక రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన బాలికను ప్రధానోపాధ్యాయులు సుధాకర్ అభినందించారు.
Similar News
News November 6, 2025
కల్వకుర్తిలో ఇంటి మెట్లపై ‘జెర్రిపోతు’ నిద్ర

కల్వకుర్తి శ్రీ సాయి కాలనీలోని పంచాయతీ సెక్రెటరీ రమేష్ ఇంటి ఆవరణంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ మెట్లపై ప్రతిరోజు సాయంత్రం ఒక జెర్రిపోతు (పాము) వచ్చి పడుకుంటోంది. ఉదయం చూసినా అక్కడే ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది విషపూరితం కానప్పటికీ, పెద్ద పాము కావడంతో పిల్లలు భయపడుతున్నారన్నారు. మూడు రోజులుగా ఇలానే జరుగుతోందని వారు పేర్కొన్నారు.
News November 6, 2025
పరకామణి కేసుపై సమగ్ర దర్యాప్తు: రవిశంకర్

AP: తిరుమలలో పరకామణి <<18117294>>చోరీ కేసుపై<<>> హైకోర్టు ఆదేశాలతో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని CID DG రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. ఇప్పటికే పరకామణి భవనం, CCTV కమాండ్ కంట్రోల్ సెంటర్, చోరీ దృశ్యాలను పరిశీలించామన్నారు. నిందితుడు రవికుమార్కు తమిళనాడు, కర్ణాటక, HYD, తిరుపతిలో ఆస్తులున్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ కేసుపై DEC 2న హైకోర్టుకు నివేదిస్తామని తెలిపారు.
News November 6, 2025
ఆ కప్పు టీకి భారీ మూల్యం: పాక్ Dy. PM

తాలిబన్స్తో ఓ టీ మీట్తో భారీ మూల్యం చెల్లిస్తున్నామని పాక్ Dy.PM ఇషాక్ దార్ అన్నారు. 2021లో తాలిబన్లు అధికారం పొందాక ISI మాజీ చీఫ్ హమీద్ ఆ దేశంలో పర్యటించి వారితో టీ తాగుతూ అంతా బాగుంటుందని భరోసా ఇచ్చారని విమర్శించారు. దీంతోనే PAK-AFG బార్డర్స్ తెరుచుకోగా వర్తకులతో పాటు వేలాది తాలిబన్స్ పాక్లోకి వచ్చారన్నారు. వారితో పాక్లోని మిలిటెంట్ గ్రూప్స్ రీ యాక్టివేట్ అయి తమపై బుసకొడుతున్నాయని వాపోయారు.


