News January 24, 2025

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ADB వాసికి చోటు

image

పట్టుదలతో ముందుకు సాగుతూ విజయాలు సాధించాలని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ కో ఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ అన్నారు. ఆదిలాబాద్‌కు చెందిన ఎస్.విఠల్ 28 నిమిషాల్లో 125 సార్లు సూర్య నమస్కారం చేసి రికార్డు సాధించారు. ఈ నేపథ్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను సత్కరించారు.

Similar News

News November 8, 2025

ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న పవన్

image

జిల్లా పర్యటనలో భాగంగా Dy.CM పవన్ కళ్యాణ్ తిరుపతి మంగళంలోని ఎర్రచందనం నిల్వ ఉన్న గోడౌన్‌కు చేరుకున్నారు. ఇందులో భాగంగా ఆయన అక్కడ ఎర్రచందనం దుంగలను పరిశీలించారు. ఎన్ని టన్నుల దుంగలు ఉన్నాయి వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

News November 8, 2025

పెద్దకడబూరులో హోరాహోరీగా పొట్టేళ్ల పందేలు

image

పెద్దకడబూరులో శ్రీ భక్త కనకదాసు జయంతిని పురస్కరించుకుని కురువ సంఘం ఆధ్వర్యంలో శనివారం పొట్టేళ్ల పందాలను టీడీపీ నేతలు రమాకాంతరెడ్డి, మల్లికార్జున ప్రారంభించారు. గ్రామీణ క్రీడలలో భాగమే పొట్టేళ్ల పందేలని గుర్తు చేశారు. ఇందులో గెలుపొందిన పొట్టేళ్లకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నల్ల, నట్టు పొట్టేళ్లకు వేరు వేరుగా పోటీలు నిర్వహించారు.

News November 8, 2025

హైదరాబాద్‌ మెట్రో ఛార్జీల పెంపు లేదు: HMRL

image

HYD మెట్రో ఛార్జీల పెంపు అని వస్తోన్న వార్తలపై HMRL క్లారిటీ ఇచ్చింది. తక్షణమే ఛార్జీలు పెంచే ఆలోచన లేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతోనే మెట్రో సేవలు కొనసాగనున్నాయని స్పష్టం చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఛార్జీల నిర్ధారణ కమిటీ సిఫారసుల ఆధారంగా మే 24, 2025 నుంచి ఛార్జీల సవరణ అమలు చేశామని గుర్తు చేశారు. ఛార్జీల పెంపు అవాస్తవమని FactCheck_Telangana ధ్రువీకరించింది.
SHARE IT