News March 18, 2024

చోడవరం: నాలుగోసారి పోటీ పడుతున్న ప్రత్యర్థులు

image

చోడవరం నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, టీడీపీ అభ్యర్థి కేఎస్ఎంఎస్ రాజు నాలుగవసారి పోటీ పడనున్నారు. 2009,2014లో చోడవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు చేతిలో కరణం ధర్మశ్రీ ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన ధర్మ శ్రీ, టీడీపీ అభ్యర్థి రాజును ఓడించారు. 2024 లో మళ్లీ వీరిద్దరూ ‌తలపడుతున్నారు. ఈసారి గెలుపు ఎవరిదో కామెంట్ చేయగలరు.

Similar News

News April 21, 2025

విశాఖలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం 

image

ద్వారకానగర్‌లో ఎస్టీ, ఎస్సి విద్యార్థుల ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్‌లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి డీఎస్సీ అభ్యర్థులు పాలాభిషేకం చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ  వేపాడ చిరంజీవరావు, తదితరులు పాల్గొన్నారు. 

News April 20, 2025

గాజువాకలో బెట్టింగ్ ముఠా అరెస్ట్ 

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ పర్యవేక్షణలో బెట్టింగ్ ముఠాను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గాజువాక పరిధిలో బీహెచ్‌పీవీ వద్ద బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం రావడంతో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 23 సెల్ ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతుందో ఆరా తీస్తున్నారు. కమిషనర్ ఏర్పాటు చేసిన స్పెషల్ టీం ఈ దాడులు చేసింది.

News April 20, 2025

విశాఖ: ఒంటరితనం భరించలేక సూసైడ్

image

ఒంటరితనం భరించలేక ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో ఆదివారం చోటు చేసుకుంది. పీఎం పాలెం సెకండ్ బస్టాప్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్‌లో మృతుడు నివస్తున్నాడు. తల్లిదండ్రులు, అన్నయ్య మృతి చెందడంతో ఒంటరిగా ఉన్న ఆయన మానసికంగా బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం KGHకి తరలించారు.

error: Content is protected !!