News March 18, 2024
SBI బాండ్ల వివరాలపై అనుమానాలు: పూనమ్

ఎలక్టోరల్ బాండ్ల వివరాలు తప్పుగా ఉన్నాయని పిటిషన్ వేసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్ మరో అనుమానం వ్యక్తం చేశారు. ‘నేను ఏప్రిల్-2018లో ఒక్కొక్కటి రూ.1000 చొప్పున 2ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశా. కానీ, ఎస్బీఐ రిలీజ్ చేసిన డేటాలో 20 అక్టోబర్ 2020లో కొన్నట్లు చూపారు. ఇది పొరపాటున జరిగిందా? లేక నా పేరుతో ఉన్న ఇంకెవరైనా బాండ్ను కొన్నారా? చెప్పాలి’ అని SBIని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Similar News
News October 31, 2025
2018లోనే జెమీమా ప్రతిభను గుర్తించిన ENG మాజీ కెప్టెన్

మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్లో అద్భుతంగా రాణించిన ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ పేరు మార్మోగుతోంది. అయితే ఈమె స్టార్గా ఎదుగుతారని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ 2018లో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరలవుతోంది. ‘ఈ పేరు గుర్తుంచుకోండి.. జెమీమా రోడ్రిగ్స్. ఇండియాకు స్టార్గా మారుతుంది’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ అంచనా నిజమైందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
News October 31, 2025
Asia Cup: ఒకట్రెండు రోజుల్లో భారత్కు ట్రోఫీ!

ఆసియా కప్ ట్రోఫీని ఒకట్రెండు రోజుల్లో ACC చీఫ్ నఖ్వీ అందజేసే అవకాశం ఉందని BCCI ఆశాభావం వ్యక్తం చేస్తోంది. నవంబర్ 4న ICC మీటింగ్ ఉండటంతో ఆ లోపు ఇస్తారని అంచనా వేస్తోంది. మరోవైపు నెల రోజులవుతున్నా ట్రోఫీని ఇవ్వకపోవడం సరి కాదని BCCI సెక్రటరీ సైకియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకట్రెండు రోజుల్లో అది ముంబైలోని బీసీసీఐ ఆఫీసుకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లేదంటే ICC దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
News October 31, 2025
లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టవచ్చా?

లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడం ప్రమాదకరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘ఇలాంటి ప్రాంతాల్లో నిర్మించిన గృహాల్లోకి వర్షాకాలంలో నీరు వచ్చే అవకాశాలుంటాయి. ఇంట్లోకి తేమ చేరితే అనారోగ్యం వస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో సౌరశక్తి, ప్రాణశక్తి కూడా తక్కువే. దీనివల్ల నివాసంలో నిరుత్సాహం ఏర్పడుతుంది. స్థిరమైన, సుఖమైన జీవనం కోసం ఎత్తుగా, సమతలంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి’ అని తెలిపారు.<<-se>>#Vasthu<<>>


