News January 24, 2025
NRPT: సన్న రకం వరి ధాన్యం క్వింటాలుకు రూ. 2,473

నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం సన్న రకం వరి ధాన్యం క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 2,473, కనిష్ఠంగా రూ. 1,940 ధర పలికిందని మార్కెట్ సెక్రటరీ భారతి తెలిపారు. తెల్ల కందులు క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 8,259, గరిష్ఠంగా రూ. 7,191, ఎర్ర కందులు గరిష్ఠంగా రూ. 7,811, కనిష్ఠంగా రూ. 5,600, వేరు శనగ గరిష్ఠంగా రూ. 5,940, కనిష్ఠంగా రూ. 3,089 ధర పలికిందని చెప్పారు.
Similar News
News January 12, 2026
పాలమూరు: సంక్రాంతికి వెళ్తూ.. మృత్యువు ఒడికి..

సంక్రాంతి పండగకు కూతురి వద్దకు వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. <<18828834>>ఈ ఘటన<<>> నిన్న భూత్పూర్లోని హైవే-44పై జరిగిన విషయం తెలిసిందే. మృతుడు శేషయ్య విశ్రాంత సైనికుడు. పదేళ్ల నుంచి భార్య నవనీతమ్మతో కలిసి మేడ్చల్లో కుమారుడితో ఉంటున్నారు. కారు డ్రైవర్గా నియమించుకొని తిరుపతిలోని కుమార్తె వద్దకు వెళ్తుండగా వెనుక నుంచి కారు బలంగా ఢీకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 12, 2026
గోదావరి జిల్లాల్లో కోడి పందేలు అలా మొదలయ్యాయి అండి.. ఆయ్!

గోదావరి జిల్లాల కోడిపందేలకు శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. పలనాటి యుద్ధంలో వీరత్వానికి, పౌరుషానికి ప్రతీకలుగా నిలిచిన ఈ పందేలను మన గోదావరి జిల్లాలు ఆదరించాయి. రాజులు, సైనికుల్లో యుద్ధకాంక్షను, ఉత్తేజాన్ని నింపేందుకు ప్రారంభమైన ఈ క్రీడ, కాలక్రమేణా మన జిల్లా సంక్రాంతి సంబరాల్లో విడదీయలేని అంతర్భాగమైంది. ఉభయ గోదావరి ప్రాంత ఆభిజాత్యానికి, సంస్కృతికి అద్దం పడుతూ ప్రత్యేక గుర్తింపును పొందాయి.
News January 12, 2026
వారాన్ని బట్టి పందెం పుంజులను బరిలో దింపుతారు

కుక్కుట శాస్త్రం ప్రకారం నక్షత్రాలను బట్టి అనుకూల రంగులున్న కోళ్లను బరిలోకి దింపుతారట. పందెం కట్టేవాళ్లు ఇంటికి బరి ఏ దిక్కున ఉందో చూసుకోవడంతో పాటు పేరులో తొలి అక్షరాన్ని బట్టి దిక్కును నిర్ణయించుకుంటారట. ఆది, శుక్రవారం అయితే ఉత్తర దిశ నుంచి.. సోమ, శనివారం అయితే దక్షిణ దిశ నుంచి.. మంగళవారం తూర్పు దిశ నుంచి బుధవారం, గురువారం పడమర దిశ నుంచి కోళ్లను బరిలోకి దింపుతారట. వారాన్ని బట్టి ఈ దిశ మారుతుంది.


