News January 24, 2025

పరిగి: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

పరిగి పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. SI సంతోశ్ వివరాలు.. పోల్కంపల్లికి చెందిన బిచ్చయ్య, శ్రీనివాస్ పెట్రోల్ బంకు వెళ్లారు. వెనక్కి తీసుకునే క్రమంలో ఒక్కసారిగా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ఉన్న ఇద్దరికీ గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా బిచ్చయ్య చనిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI వెల్లడించారు.

Similar News

News January 12, 2026

NZB: 35 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

image

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 35 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. కాగా ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్టు CP చెప్పారు.

News January 12, 2026

వికారాబాద్: ఎన్నికలకు సిద్ధం కండి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 12న ఓటర్ లిస్ట్ తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News January 12, 2026

జనగామ: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం: DY.CM

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు, అధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనగామ జిల్లా నుంచి వీసీలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తదితరులు పాల్గొన్నారు.