News January 24, 2025
త్వరలో RTCలో నియామకాలు: మంత్రి

TGSRTCలో త్వరలో 3038 మంది డ్రైవర్లు, కండక్టర్లతో పాటు కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. 3500 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందినా గత ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని, కొత్త బస్సులు కొనలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం 2000 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని, మరో 600 బస్సులను డ్వాక్రా సంఘాలు కొంటాయని చెప్పారు. HYDలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని తెలిపారు.
Similar News
News February 13, 2026
డయాబెటిస్తో మతిమరుపు రిస్క్.. ఎలాగంటే?

టైప్-2 డయాబెటిస్తో బాధపడేవాళ్లలో మతిమరుపు రిస్క్ ఎక్కువని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటి ప్రకారం.. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బ్రెయిన్ గ్లూకోజ్ను వాడుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. ఫలితంగా న్యూరోలాజికల్ డ్యామేజ్ జరుగుతుంది. నిరంతర హైబీపీ వల్ల ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాస్కులర్ డ్యామేజ్ జరిగి బ్రెయిన్ టిష్యూ దెబ్బతింటుంది. దీంతో దీర్ఘకాలంలో అల్జీమర్స్ రిస్క్ పెరుగుతుంది.
News February 13, 2026
కాషాయ కలవరం.. పట్టించుకోని పట్టణ ఓటర్లు!

TG: పంచాయతీ ఎన్నికల్లో కొంత మేరకే ప్రభావం చూపిన BJP.. మున్సిపోల్స్పై భారీ ఆశలు పెట్టుకుంది. పట్టణ ఓటర్లు తమ వైపు ఉంటారని అంచనా వేసింది. కానీ ఫలితాల్లో వెనకబడింది. ముగ్గురు MLAలున్న ఉమ్మడి ADB జిల్లాలో ప్రభావం చూపలేదు. నిర్మల్, భైంసాలో తక్కువ సీట్లతో సరిపెట్టుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ MP సెగ్మెంట్ కరీంనగర్ పరిధిలో ఒక్క మున్సిపాలిటీలోనూ పోటీ ఇవ్వలేదు. మహబూబ్నగర్లో కూడా అదే పరిస్థితి.
News February 13, 2026
BJPకి ఓట్ల శాతం పెరిగింది: రామచందర్ రావు

TG: మున్సిపల్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే BJPకి ఓటు శాతం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. తమ పార్టీని ఓడించడానికి ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని ఆరోపించారు. మొత్తం వార్డులు డివిజన్లు కలిపి 350సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు కైవసం చేసుకోబోతున్నాం అని తెలిపారు. హంగ్ వచ్చిన చోట బీజేపీ ఎవరికీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు.


