News January 24, 2025

జుక్కల్‌: చికెన్ కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి..

image

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రానికి చెందిన నాగనాథ్ అనే వ్యక్తి ఈనెల 23న సాయంత్రం పెద్ద ఏడ్గి గ్రామానికి బైక్‌పై చికెన్ కోసం వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. మృతుడి భార్య గంగామణి ఫిర్యాదు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Similar News

News January 18, 2026

ఇరాన్‌లో లీడర్‌షిప్ మారాలి: ట్రంప్

image

ఇరాన్‌లో కొత్త నాయకత్వం రావాల్సిన సమయం ఆసన్నమైందని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ‘సిక్ మ్యాన్’గా సంబోధించిన ఆయన దేశాన్ని హింసతో కాకుండా గౌరవంతో నడపాలని హితవు పలికారు. దేశాన్ని సరిగ్గా ఎలా నడపాలో తన నుంచి నేర్చుకోవాలన్నారు. ఇరాన్ నేతల తీరు వల్ల ఆ దేశంలో సాధారణ ప్రజలు నివసించలేని పరిస్థితి నెలకొందన్నారు.

News January 18, 2026

నెల్లూరోళ్లు రూ.23.17 కోట్ల మద్యం తాగేశారు..!

image

నెల్లూరు జిల్లాలో సంక్రాంతి ఘనంగా జరిగింది. 3రోజులు ప్రజలు ఆహ్లాదంగా గడిపారు. మందుబాబులు మత్తులో మునిగి తేలారు. ఫలితంగా జిల్లాలోని వైన్ షాపులన్నీ కిటకిటలాడాయి. పల్లె, పట్టణమనే తేడా లేకుండా జిల్లా అంతటా మద్యం ఏరులైపారింది. 14 నుంచి 16వ తేదీ రాత్రి వరకు రూ.23.17 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా రూ. 2.06. కోట్ల మేర వ్యాపారం జరిగింది.

News January 18, 2026

KGHలో శవాల మీద డబ్బులు వసూలు..!

image

KGHలో లంచం లేనిదే పని జరగదనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్ఛార్జ్ అయ్యే వరకు ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరికి లంచం ఇవ్వాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఆఖరికి శవాల మీదా డబ్బులు వసూలు చేస్తున్నారంట. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నిన్న KGHని విజిట్ చేయగా.. శానిటేషన్ వర్కర్ డబ్బులు అడుగుతున్నట్లు రోగి బంధువులు చెప్పడంతో ఆయన మండిపడ్డారు. మీకెప్పుడైనా ఈ సమస్య ఎదురైందా?