News January 24, 2025

దోమకొండ గడికోటలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా

image

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం గడికోటలోని మహాదేవుడిని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మెుక్కులు చెల్లించుకున్నారు.ప్రియాంక చోప్రాకు గడికోట సభ్యులు, కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. కాగా ప్రియాంక చోప్రా గతంలో హీరో రాంచరణ్ తేజ్‌తో కలిసి జంజీర్ సినిమాలో నటించింది. ఆ సమయంలో ఈ దేవాలయం ప్రత్యేకతను ప్రియాంకకు వివరించగా..తాజాగా ఆమె ఈ కోటను దర్శించుకున్నారు.

Similar News

News November 10, 2025

సాహితీ శిఖరం నేలకొరిగింది: సీఎం రేవంత్

image

TG: అందెశ్రీ మరణంపై CM రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకొరిగిందన్నారు. రాష్ట్ర సాధనలో అందెశ్రీ కోట్లాది ప్రజల గొంతుకై నిలిచారని కొనియాడారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణను ప్రజా ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించిందని గుర్తు చేసుకున్నారు. TPCC చీఫ్ మహేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు కూడా అందెశ్రీ మరణానికి సంతాపం తెలిపారు.

News November 10, 2025

ఐఆర్ 30 శాతం ప్రకటించాలి: PRTU

image

AP: హైస్కూల్ ప్లస్‌లలో లెక్చరర్లుగా అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటుచేయాలని, మధ్యంతర భృతి(IR) 30 శాతం ప్రకటించాలని కోరింది. అలాగే మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో హెడ్ మాస్టర్లకు ప్రత్యేక జాబ్ చార్ట్ ప్రకటించాలని APMPS HMల ఫోరం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది.

News November 10, 2025

సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో ANM దుర్మరణం

image

సిద్దిపేట జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన<<18244517>> రోడ్డు ప్రమాదం<<>>లో ఏఎన్ఎం దుర్మరణం చెందారు. చిన్నకోడూరు మం. గంగాపురం వాసి ఎర్రోళ్ల నర్సయ్య.. భార్య సునీత(30), కుమార్తె కీర్తనతో కలిసి బైక్‌పై చేర్యాల నుంచి వస్తున్నారు. లేనిన్‌నగర్‌ శివారులో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో సునీత స్పాట్‌లోనే చనిపోగా తీవ్రంగా గాయపడిన తండ్రి బిడ్డను సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. సునీత శనిగరం PHCలో ఏఎన్ఎంగా పనిచేస్తుంది.