News March 18, 2024
వరంగల్: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710731659402-normal-WIFI.webp)
పదోతరగతి పరీక్షలకు వేళైంది. నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నిమిషం నిబంధన ఎత్తివేశారు. వరంగల్ జిల్లాలో 253 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 43,325 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
Similar News
News July 3, 2024
ములుగు జిల్లా పేరు మార్పు.. మీరేమంటారు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719971428306-normal-WIFI.webp)
ములుగు జిల్లా పేరు మార్పుపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో నేడు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి అధికారులు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈమేరకు సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా పేరు మార్చుతూ ఇప్పటికే అధికారులు పబ్లిక్ నోటీసులు జారీ చేశారు. మరి జిల్లా పేరు మార్పుపై మీరేమంటారు. కామెంట్లో తెలపండి
News July 3, 2024
తొర్రూరు: అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719970538655-normal-WIFI.webp)
ప్రేమ పేరుతో బెదిరించి బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీష్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. డివిజన్ కేంద్రానికి చెందిన ఓ బాలికపై వాటర్ ప్లాంట్లో పనిచేసే ఇనుగుర్తి గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని ఎస్సై తెలిపారు.
News July 3, 2024
WGL: వాట్సాప్ నుంచే ఫిర్యాదు చేయొచ్చు: సీపీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719967701581-normal-WIFI.webp)
కొత్త చట్టాలపై WGL సీపీ అంబర్ కిషోర్ ఝూ కీలక అంశాలను వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నూతన చట్టంలో మహిళలు, బాలలపై జరిగే నేరాలకు కఠిన శిక్షలు అమలు చేస్తామన్నారు. బాధితులు చేసిన ఫిర్యాదుల వివరాలను ఆన్లైన్లో పరిశీలించుకోవచ్చని తెలిపారు. బాధితులు అత్యవసరంగా సంబంధిత ఠాణా నంబర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని, విచారించిన తర్వాత కోర్టు అనుమతితో కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.