News January 24, 2025
కేబుల్ ఆపరేటర్లకు రూ.100 కోట్ల పెనాల్టీ రద్దు

AP: కేబుల్ ఆపరేటర్లపై విధించిన రూ.100 కోట్ల పెనాల్టీలను రద్దు చేస్తున్నట్లు ఫైబర్నెట్ ఛైర్మన్ GV రెడ్డి ప్రకటించారు. సెట్టాప్ బాక్స్ అద్దె కింద ఆపరేటర్ల నుంచి ప్రతి కనెక్షన్కు నెలకు రూ.59 చొప్పున ఇకపై వసూలు చేయబోమన్నారు. ఫైబర్ నెట్ ప్లాన్లను సవరించి తక్కువ ధరకు సేవలు అందించేలా చర్యలు చేపడతామన్నారు. అటు తిరుమల కొండపై అన్ని ఆఫీసులు, షాపులు, ఇళ్లకు ఉచితంగా ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇస్తామన్నారు.
Similar News
News November 7, 2025
APPLY NOW: AVNLలో ఉద్యోగాలు

చెన్నై ఆవడిలోని ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ (<
News November 7, 2025
రబీలో సాగుచేసే వరి రకాలకు ఉండాల్సిన లక్షణాలు

రబీ(యాసంగి)లో సాగు నీటి లభ్యతను బట్టి వరిని సాగు చేయాలి. అలాగే విత్తుకొనే వరి రకాల పంట కాలం 120-130 రోజుల మధ్య ఉండాలి. ముఖ్యంగా అగ్గి తెగులు, దోమ పోటును తట్టుకొనే రకాలై ఉండాలి. వర్షాలకు పైరు పడిపోని రకాలను ఎన్నుకోవాలి. మెడవిరుపును తట్టుకోవాలి. చలిని తట్టుకొని పిలకలు బాగా చేయగలగాలి. గింజరాలడం తక్కువగా ఉండాలి. మేలైన గింజ నాణ్యత కలిగి మంచి ధర వచ్చే వరి రకాలను ఎన్నుకోవాలంటున్నారు వ్యవసాయ నిపుణులు.
News November 7, 2025
DEC నుంచి మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు?

ప్రైవేట్ టెలికం కంపెనీలు డిసెంబర్ 1 నుంచి రీఛార్జ్ రేట్లను పెంచే అవకాశం ఉందని నేషనల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దాదాపు 10% వరకు పెరగవచ్చని పేర్కొన్నాయి. 5G సర్వీస్ విస్తరణ, నెట్వర్క్ మెయింటనెన్స్ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు, రెవెన్యూ పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. టారిఫ్స్ పెంచితే ఉదాహరణకు రోజుకు 2GB 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ.949 నుంచి రూ.999కి పెరిగే అవకాశం ఉంది.


