News January 24, 2025

సాతర్లలో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

image

జోగులాంబ గద్వాల జిల్లాలో హెచ్చుతగ్గు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో మొన్నటి వరకు చలి తీవ్రత పెరిగిన.. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటలలో సాతర్లలో 15.4 డిగ్రీలు, చిన్న తాండ్రపాడులో 15.6 డిగ్రీలు, బూడిదపాడులో 15.9 డిగ్రీలు, వడ్డేపల్లి, తోతినొనిదొడ్డిలో 16.1 డిగ్రీలు, ధరూర్, జల్లాపూర్‌లో 17.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News October 28, 2025

జూబ్లీ బైపోల్: ప్రచారానికి రేవంత్.. మరి KCR?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను టీపీసీసీ ఖరారు చేసింది. అక్టోబరు 31 నుంచి ప్రచారం చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఇదిలా ఉండగా BRS అధినేత కేసీఆర్ ప్రచారంచేసే తేదీలు ఖరారు కాలేదు. తమ బాస్ ప్రచారం చేస్తే సునీత గెలుస్తారని కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే కేసీఆర్ ప్రచారంపై పార్టీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.

News October 28, 2025

GNT: మిర్చి, పసుపు యార్డులకు 2 రోజులు సెలవు

image

మొంథా తుపాన్ ప్రభావం కారణంగా గుంటూరు మిర్చి యార్డుకు మంగళ, బుధవారాలు సెలవు ప్రకటించారు. రైతులు సరుకు తీసుకురావద్దని మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకుడు శ్రీనివాసరావు సూచించారు. కమిషన్ ఏజెంట్లు రహదారులపై సరుకు నిల్వ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే దుగ్గిరాల పసుపు యార్డుకు కూడా 2 రోజులు సెలవు ప్రకటించారు. రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు.

News October 28, 2025

పల్నాడు: ‘అన్నదాత సుఖీభవ’ లబ్ధిదారులకు మరో అవకాశం

image

పల్నాడు జిల్లాలో వివిధ కారణాల వల్ల 16,238 మంది పట్టాదార్ రైతులకు ఆధార్ సీడింగ్ కాలేదని అధికారులు గుర్తించారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఎంపికై, ఆధార్ కారణంగా నగదు పడని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ లబ్ధిదారులకు మీ సేవ కేంద్రాలలో ఆధార్ సీడింగ్‌కు సర్వీస్ ఛార్జి మినహాయింపు ఇస్తూ సీసీఎల్ఏ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.