News March 18, 2024

నిజామాబాద్: కన్నతల్లి పై కొడుకు కర్కశత్వం

image

నిజామాబాద్‌లోని గౌతమ్ నగర్‌లో గొల్ల గంగామణి నివాసం ఉంటుంది. గంగామణి కి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని నెలల క్రితం పెద్ద కుమారుడు మరణించాడు. చిన్న కుమారుడు గొల్ల పవన్ కుమార్ మేస్త్రీ పని చేస్తూ దుబ్బ ప్రాంతంలో నివాసం ఉంటాడు. గంగామణి వద్దకు పవన్ కుమార్ వచ్చి కన్నతల్లి పై దుర్భాషలాడుతూ కాలితో తన్నుతూ విచక్షణ రహితంగా ముఖంపై పిడి గుద్దులు కురిపిస్తూ దాడి చేశాడు.

Similar News

News March 10, 2026

NZB: ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్ హెచ్చరిక

image

NZB జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమ రవాణా జరగకూడదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరిక జారీ చేశారు. ఇసుకను అక్రమంగా తవ్వకం లేదా రవాణా చేస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జిల్లాలో ఇసుక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మన ఇసుక వాహనం ఇసుక ఆన్లైన్ యాప్ ద్వారానే అనుమతులు తీసుకొని రవాణా చేసుకోవాలని సూచించారు.

News March 10, 2026

NZB: ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉంది: TPCC చీఫ్

image

ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం నగరంలోని ఖిలా రోడ్‌లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన అధికారిక ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మైనారిటీల కోసం విద్య, ఉపాధి రంగాల్లో అనేక పథకాలను, షాదీ ముబారక్’ పథకాన్ని పకడ్బందీగా అమల చేస్తోందన్నారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.

News March 9, 2026

NZB: 96.7శాతం హాజరు.. 676 మంది విద్యార్థులు గైర్హాజరు

image

సోమవారం జిల్లాలోని 58 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం భౌతికశాస్త్రం, అర్ధ శాస్త్రం, ఒకేషనల్ పరీక్షలు ప్రశాంతంగా జరగగా 96.7శాతం విద్యార్థులు హాజరయ్యారని NZBజిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ తెలిపారు. మొత్తం 20,413 మంది విద్యార్థులకు గాను19,737 మంది హాజరయ్యారని, 676 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారని ఆయన వివరించారు.