News January 24, 2025
సాలూరు: ‘సాగు చేస్తున్న దళితులకు పట్టాలు ఇవ్వాలి’

భూమి సాగు చేస్తున్న దళితులుకు పట్టాలివ్వలని, దళితులుపై దౌర్జన్యం చేయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు కొల్లు గంగు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సాలూరు మండలం కరాసవలస పరిధిలో గుర్రప్ప వలస రెవెన్యూలో 5 ఎకరాలు సాగు చేస్తున్న దళితులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని పేదల మధ్య తగాదాలు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News January 16, 2026
ED దాడులు.. బీరువా నిండా రూ.500 నోట్లు

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈడీ చేపట్టిన తనిఖీల్లో భారీగా డబ్బు దొరికింది. బొగ్గు, బ్లాక్ స్టోన్ అక్రమ మైనింగ్పై విచారణ నేపథ్యంలో 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. PMLA కింద మాఫియా, వారి వ్యాపార భాగస్వాముల ఇళ్లలో దాడులు చేసింది. ఓ బీరువా నిండా నగదు, లగ్జరీ కార్లు, ఆస్తి పత్రాలను గుర్తించింది. ఆ నగదు విలువ ఎంతో త్వరలో వెల్లడిస్తామని ఈడీ తెలిపింది.
News January 16, 2026
వార్డుల రిజర్వేషన్లు పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్

మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను జీవో ప్రకారం అత్యంత పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కమిషనర్లు రిజర్వేషన్ పట్టికలను సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. గణాంకాలు, రొటేషన్ పద్ధతి, గత డేటాను పరిశీలించాలని, ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే సంప్రదించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News January 16, 2026
ప.గో: సుడి తిరిగింది.. కారు, రూ.20 లక్షల క్యాష్ ప్రైజ్!

ఉంగుటూరు(M) నారాయణపురం దండుదారిపుంత బరిలో నిడమర్రు మండలం పత్తేపురానికి చెందిన పొత్తూరి నరసింహరాజుని అదృష్టం వరించింది. బరిలో నిర్వహించిన లక్కీ డ్రాలో రూ.25 లక్షల విలువైన కారును గెలుచుకోగా, పందేల్లో మరో రూ.20 లక్షల గెలుపొందారు. మొత్తంగా రూ.45 లక్షల సొంతం చేసుకున్న విజేతకు ఎమ్మెల్యే ధర్మరాజు కారును అందజేశారు.


