News January 24, 2025

సాలూరు: ‘సాగు చేస్తున్న దళితులకు పట్టాలు ఇవ్వాలి’

image

భూమి సాగు చేస్తున్న దళితులుకు పట్టాలివ్వలని, దళితులుపై దౌర్జన్యం చేయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు కొల్లు గంగు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సాలూరు మండలం కరాసవలస పరిధిలో గుర్రప్ప వలస రెవెన్యూలో 5 ఎకరాలు సాగు చేస్తున్న దళితులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని పేదల మధ్య తగాదాలు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News December 27, 2025

ఏయూ మైదానంలో ప్రారంభమైన శ్రామిక ఉత్సవ్

image

బీచ్ రోడ్‌లోని ఏయు ఎగ్జిబిషన్ మైదానంలోని అఖిలభారత జాతీయ మహాసభలతో పాటు శ్రామిక ఉత్సవ్ కార్యక్రమాన్ని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రారంభించారు. వచ్చి నెల 2వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవం కార్యక్రమంలో పలు సాంకేతిక ప్రదర్శనలు జాతీయస్థాయి ప్రముఖులు పాల్గొన్నారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి నరసింగరావు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ మురళి హాజరు అయ్యారు. మొదటి రోజు కార్యక్రమంలో పుస్తక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

News December 27, 2025

VZM: ఎస్పీ దామోదర్‌కు సీనియర్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి

image

2013వ సంవత్సరం బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు సెలెక్షన్ గ్రేడ్ (సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా ప్రభుత్వం పదోన్నతి కల్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్‌కు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి ఇచ్చి, ఇదే జిల్లాలో సీనియర్ ఎస్పీగా కొనసాగాలని శనివారం ఆదేశాలు వెలువడ్డాయి. పదోన్నతి సందర్భంగా జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది ఎస్పీకు శుభాకాంక్షలు తెలిపారు.

News December 27, 2025

టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి నాకంటే ముందున్నారు: చంద్రబాబు

image

NTR ట్రస్టు, విద్యాసంస్థలను నారా భువనేశ్వరి సమర్థవంతంగా నడిపిస్తున్నారని CM CBN ప్రశంసించారు. HYDలో జరిగిన NTR ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి తన కంటే ముందున్నారని, తాను పేపర్ చూసి స్పీచ్ ఇస్తుంటే ఆమె ట్యాబ్ చూసి మాట్లాడుతున్నారని చమత్కరించారు. ఇక చిన్నప్పుడు తనను చాలామంది IAS చదవమన్నా తాను రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాయని చెప్పారు.