News January 24, 2025

రాజోలు: ఆలయ శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే

image

రాజోలు మండలం కూనవరం గ్రామంలో శ్రీఅన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం భూమి పూజలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తోందన్నారు. దీనికి ప్రజలు సహకారం అందించాలని కోరారు. ఎంపీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Similar News

News January 14, 2026

BREAKING: భారత్ ఓటమి

image

టీమ్ ఇండియాతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 285 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 47.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మిచెల్ సెంచరీ (131*)తో చెలరేగి తమ జట్టుకు విజయాన్ని అందించారు. యంగ్ 87 పరుగులతో రాణించారు. మూడో వన్డే జనవరి 18న ఇండోర్‌లో జరగనుంది.

News January 14, 2026

కొమురవెల్లి మల్లన్న దర్శించుకున్న సీపీ

image

కొమురవెల్లి మల్లికార్జున స్వామిని సీపీ రష్మి పెరుమాల్ దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. స్వామివారి శేష వస్త్రాన్ని, ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఈనెల 18న బ్రహ్మోత్సవ ఏర్పాట్లను, క్యూలైన్, సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News January 14, 2026

కైలాస వాహనంపై ఆది దంపతులు

image

శ్రీశైలం క్షేత్రంలో కొలువైన శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి దంపతులు సంక్రాంతి ఉత్సవాలు పురస్కరించుకుని బుధవారం రాత్రి కైలాస వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు, పండితులు ముందుగా స్వామి, అమ్మ వారిని విశేషంగా అలంకరించి కైలాస వాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవం చేపట్టగా వేలాది భక్తులు దర్శించుకున్నారు.