News January 24, 2025
సీఎం చంద్రబాబుకు వెల్కమ్ చెప్పిన మంత్రి సత్యకుమార్

ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. దావోస్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న సీఎంకు గన్నవరం విమానాశ్రయంలో మంత్రి స్వాగతం పలికారు. అనంతరం సీఎంతో కలిసి సచివాలయానికి వెళ్లారు. దావోస్లో పెట్టుబడుల కోసం చేసిన కృషి అభినందనీయమని మంత్రి ప్రశంసించారు.
Similar News
News November 5, 2025
సిక్కుల ఆరాధ్య దైవం మన గుంటూరు వచ్చారని తెలుసా?

గుంటూరు జిల్లాలో సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్ సందర్శించిన ప్రదేశంగా ‘గురుద్వారా పెహ్లీ పాట్షాహీ’ గుర్తింపు పొందింది. రెండవ ఉదాసి (1506–1513) కాలంలో గురునానక్ దక్షిణ భారత పర్యటనలో గుంటూరును సందర్శించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. ఆయన ప్రసంగాలతో ప్రభావితమై ఏర్పడిన ఈ గురుద్వారా ఆధ్యాత్మిక చరిత్రలో ముఖ్య స్థావరంగా నిలిచింది. 19వ శతాబ్దంలో తీర్థయాత్రికులు ఈ ప్రాంతాన్ని తిరిగి అభివృద్ధి చేశారు.
News November 5, 2025
ఫ్రీ బస్సు హామీ.. న్యూయార్క్లో విజయం

న్యూయార్క్ (అమెరికా) మేయర్గా <<18202940>>మమ్దానీ గెలవడంలో<<>> ఉచిత సిటీ బస్సు ప్రయాణ హామీ కీలకపాత్ర పోషించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే బస్ లేన్స్, వేగం పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. వాటితో పాటు సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు పెంచి ఉద్యోగులపై ట్యాక్సులను తగ్గిస్తామని చెప్పారు. నగరంలో ఇంటి అద్దెలను కంట్రోల్ చేస్తామని హామీ ఇవ్వడం ఓటర్లను ఆకర్షించింది.
News November 5, 2025
‘టికెట్లు అమ్ముకునే సంస్కృతి టీడీపీకి లేదు’

ఎన్నికల్లో డబ్బులకు టికెట్లు అమ్ముకునే సంస్కృతి టీడీపీకి, టీజీ కుటుంబానికి లేదని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. కర్నూలు కార్పొరేటర్ ఎన్నికల్లో డిపాజిట్లు ఇస్తేనే టికెట్లు ఇస్తారన్న పుకార్లపై ఆయన బుధవారం స్పందించారు. వార్డుల్లో ప్రజలకు అండగా ఉన్న వారికే టికెట్లు కేటాయిస్తామని, టికెట్ ఇచ్చేముందు సర్వేలు చేయిస్తామని మంత్రి ప్రకటించారు.


