News January 24, 2025

NRPT: చట్టాలపై విద్యార్థులకు అవగాహన అవసరం

image

జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్, జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్ మాట్లాడుతూ.. బాలికల హక్కులు, చట్టాలు, విద్యా హక్కు పై అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

Similar News

News March 13, 2025

సలహాలు, సూచ‌న‌లు ఇవ్వండి: విశాఖ కలెక్టర్

image

ఈఆర్వో, డీఈవో, సీఈవో స్థాయిలో పరిష్కారంకాని ఏవైనా సమస్యలపై భారత ఎన్నికల సంఘానికి నేరుగా సూచ‌న‌లు ఇవ్వొచ్చ‌ని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ‌, ప్రాంతీయ‌ రాజ‌కీయ పార్టీల‌కు ఆహ్వానం తెలుపుతూ ఎన్నిక‌ల సంఘం వెసులుబాటు కల్పించిందని కలెక్టర్ వివరించారు. రాజ‌కీయ పార్టీల‌కు విడివిడిగా ఎన్నిక‌ల సంఘం లేఖలు పంపినట్లు పేర్కొన్నారు.

News March 13, 2025

‘వైసీపీ ఉనికి కోసమే యువత పోరు చేపట్టింది’

image

నంద్యాల: రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ కేవలం ఉనికి కోసమే యువత పోరు కార్యక్రమం చేపట్టిందని యూనివర్సల్ స్టూడెంట్ యూత్ యూనియన్ అధ్యక్షుడు ముద్దం నాగ నవీన్ మండిపడ్డారు. యువత జీవితాలను నాశనం చేయాలని జగన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాడన్నారు. తన హయాంలో నిరుద్యోగ శాతం పెంచి.. ఇప్పుడు ఫీజు పోరు చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.

News March 13, 2025

స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో ఎస్పీ సమీక్ష

image

సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలు, క్రైం అగనెస్ట్ ఉమెన్, తదితర నేరాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు భాగస్వామ్యులు కావాలని ఎన్జీవోల ప్రతినిధులకు ఎస్పీ జగదీశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఆయన సమావేశం నిర్వహించారు. సమష్టిగా కృషి చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ కోరారు.

error: Content is protected !!