News January 24, 2025
పెద్దపల్లి: ఎమ్మెల్యే సొంత డబ్బులతో రాజమల్లు విగ్రహం ఏర్పాటు

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాజమల్లు లేనిలోటు తీర్చలేనిదని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా గుర్తింపు పొందిన నాయకుడు రాజమల్లు అని ఆయన కొనియాడారు. శుక్రవారం ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా తన సొంత ఖర్చులతో సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రధాన కూడలి వద్ద రాజమల్లు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.
Similar News
News March 13, 2025
సలహాలు, సూచనలు ఇవ్వండి: విశాఖ కలెక్టర్

ఈఆర్వో, డీఈవో, సీఈవో స్థాయిలో పరిష్కారంకాని ఏవైనా సమస్యలపై భారత ఎన్నికల సంఘానికి నేరుగా సూచనలు ఇవ్వొచ్చని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు ఆహ్వానం తెలుపుతూ ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించిందని కలెక్టర్ వివరించారు. రాజకీయ పార్టీలకు విడివిడిగా ఎన్నికల సంఘం లేఖలు పంపినట్లు పేర్కొన్నారు.
News March 13, 2025
‘వైసీపీ ఉనికి కోసమే యువత పోరు చేపట్టింది’

నంద్యాల: రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ కేవలం ఉనికి కోసమే యువత పోరు కార్యక్రమం చేపట్టిందని యూనివర్సల్ స్టూడెంట్ యూత్ యూనియన్ అధ్యక్షుడు ముద్దం నాగ నవీన్ మండిపడ్డారు. యువత జీవితాలను నాశనం చేయాలని జగన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాడన్నారు. తన హయాంలో నిరుద్యోగ శాతం పెంచి.. ఇప్పుడు ఫీజు పోరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News March 13, 2025
స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో ఎస్పీ సమీక్ష

సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలు, క్రైం అగనెస్ట్ ఉమెన్, తదితర నేరాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు భాగస్వామ్యులు కావాలని ఎన్జీవోల ప్రతినిధులకు ఎస్పీ జగదీశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఆయన సమావేశం నిర్వహించారు. సమష్టిగా కృషి చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ కోరారు.