News January 25, 2025
భద్రాద్రి: స్మగ్లర్లు, వేటగాళ్లపై కఠిన చర్యలు: DFO కృష్ణగౌడ్

అడవుల్లో వన్యప్రాణులకు ఉచ్చులు ఏర్పాటు చేసి జంతువులను చంపుతున్న వేటగాళ్లపై నిఘా ఏర్పాటు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ సూచించారు. శుక్రవారం ఆయన రేగళ్ల, ఆళ్లపల్లి, చాతకొండ పలు రేంజిలను సందర్శించారు. అడవిని కొల్లగొడుతున్న స్మగ్లర్లు, వేటగాళ్లపై నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో రేంజర్లు జశ్వంత్, కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News September 15, 2025
వేరు శనగ దిగుబడి పెరగాలంటే..

వేరుశనగలో నత్రజని లోపిస్తే ఆకులు పసుపు పచ్చగా, భాస్వరం లోపిస్తే ఆకులు, కాండం ఎర్రగా మారి మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. వేరుశనగకు ఎకరాకు 8KGల నత్రజని అవసరం. దీనిని ఎకరాకు 18KGల యూరియా రూపంలోగానీ, 100KGల DAP రూపంలో గానీ విత్తనం విత్తుకునేటప్పుడే వేసుకోవాలి. పంటకు 16KGల భాస్వరం అవసరం. దీన్ని 100KGల సింగల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో లేదా 35KGల DAP రూపంలో ఆఖరి దుక్కిలో వెయ్యాలి. దీనివల్ల దిగుబడి పెరుగుతుంది.
News September 15, 2025
వక్ఫ్ చట్టాన్ని సస్పెండ్ చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరణ

వక్ఫ్ చట్టాన్ని సస్పెండ్ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే పలు సెక్షన్లపై స్టే విధించింది. ఆస్తిని వక్ఫ్కు అంకితం చేయాలంటే కనీసం ఐదేళ్లు ఇస్లాంను ఆచరించాలనే నిబంధనను తాత్కాలికంగా నిలిపివేసింది. 1932 నుంచి ఇప్పటివరకు వక్ఫ్ చట్టాల చరిత్రను పరిశీలించామని, మొత్తం చట్టాన్ని నిలిపివేయడానికి తగిన ఆధారాలు లేవని CJI గవాయ్ పేర్కొన్నారు. అరుదైన సందర్భాల్లోనే చట్టాల అమలును నిలిపివేస్తామన్నారు.
News September 15, 2025
KNR: ఒకే వేదికపై కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి, MP

MNCL రైల్వే స్టేషన్లో <<17713840>>వందే భారత్ రైలు<<>>కు అదనపు స్టాప్ను కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్, MP వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు కీలక నేతలు వేదికపై నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు ఎప్పుడు ఉప్పునిప్పుల్లా ఉండే ఇరుపార్టీల నాయకులు ప్రొటోకాల్ సమయంలో మాత్రం ఇలా హుందాగా వ్యవహరించడం మంచి పరిణామమని అంటున్నారు. మీ COMMENT.