News January 25, 2025

నేడు రాజమండ్రి విమనాశ్రయానికి టెక్నికల్ టీం రాక

image

రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌లో నూతన టెర్మినల్ భవనం నిర్మాణంలో శుక్రవారం మిషనరీ పనులు నిర్వహిస్తుండగా క్రేన్ ద్వారా అమరుస్తున్న పిల్లర్ సెట్టింగ్ జారిపడి విషయం విధితమే. ఇద్దరికీ స్వల్పగాయాలయ్యాయని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ జ్ఞానేశ్వరరావు తెలిపారు. ప్రమాదానికి కారణాలను అంచనాలు వేసేందుకు చెన్నై, హైదరాబాద్ టెక్నికల్ టీమ్స్ శనివారం వస్తున్నట్టు తెలిపారు. ప్రమాదంలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారని తెలిపారు.

Similar News

News January 9, 2026

పాసు పుస్తకాల్లో తప్పులు.. 16 వేల బుక్కులు వెనక్కి!

image

రీ సర్వేలో భాగంగా ముద్రించిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులు దొర్లడంతో 16,101 పుస్తకాలను వెనక్కి పంపినట్లు తూ.గో. డీఆర్వో సీతారామమూర్తి శుక్రవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 1,04,618 పుస్తకాలను పరిశీలించగా ఇవి వెలుగుచూశాయన్నారు. బ్యాంకుల్లో తాకట్టు ఉన్న పాత పుస్తకాలను ఇచ్చి కొత్తవి తీసుకోవాలని కలెక్టర్ సూచించినట్లు పేర్కొన్నారు. రైతులు తమ వివరాలను సరిచూసుకోవాలని అధికారులు వెల్లడించారు.

News January 9, 2026

సంక్రాంతి వేళ డ్రోన్ల నిఘా.. ఎస్పీ వార్నింగ్!

image

సంక్రాంతి వేళ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నర్సింహ కిషోర్ వెల్లడించారు. భద్రతలో భాగంగా డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచినట్లు తెలిపారు. నేర నియంత్రణకు పోలీస్ బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ స్థానికులకు అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు. పండుగ పూట ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.

News January 9, 2026

రాజమండ్రి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా జాబ్ మేళా

image

రాజమండ్రిలో శనివారం నిర్వహించే మెగా జాబ్ మేళా బ్రోచర్‌ను మాజీ ఎంపీ మార్గాని భరత్ గురువారం విడుదల చేశారు. మంజీర కన్వెన్షన్‌లో ఈ మెగా జాబ్ కార్యక్రమం జరగనుంది. ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులైన వారికి అక్కడికక్కడే నియామక పత్రాలు అందజేస్తామని భరత్ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని ఆయన కోరారు.