News January 25, 2025
రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: జనగామ కలెక్టర్

రైతు భరోసా పథకం కింద కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం వచ్చిన రైతులు, ఇంతకు ముందే పాసు పుస్తకం కలిగి ఉండి కూడా దరఖాస్తు చేసుకోని వారు ఈ నెల 31లోగా ఏఈవోల వద్ద దరఖాస్తు చేసుకోవాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. అలాగే బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకునే వారు సైతం దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో రైతుబంధు పొందిన రైతులు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు.
Similar News
News March 1, 2026
HYD: నకిలీ ఇన్సూరెన్స్లు.. 9 మంది అరెస్ట్

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల పేర్లతో నకిలీ వాహన బీమా పత్రాలను సృష్టిస్తున్న 9మంది ముఠా సభ్యులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా నకిలీ పత్రాలు, స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్ వెల్లడించారు. అవసరంలో ఉన్న వాహనదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. ప్రజలు అధికారిక వెబ్సైట్ల ద్వారానే బీమా తీసుకోవాలని పోలీసులు సూచించారు.
News March 1, 2026
కృష్ణా: డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో జనవరి 2026లో నిర్వహించిన డిగ్రీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు కృష్ణా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని KRU పరీక్షల విభాగం అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
News March 1, 2026
ఖమేనీ మృతి.. అమెరికా, ఇజ్రాయెల్కు IRGC వార్నింగ్

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీని హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా, ఇజ్రాయెల్ను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించింది. తమ నాయకుడి మరణానికి బాధ్యులైన ఆ దేశాలకు కఠిన శిక్ష విధిస్తామని తెలిపింది. కాగా IRGC ఇరాన్ శక్తిమంతమైన దళాలలో ఒకటి. ఇరాన్ తొలి సుప్రీంలీడర్ ఖొమైనీ స్థాపించిన ఈ IRGCని ఖమేనీ తిరుగులేని శక్తిగా మలిచారు. దీని సాయంతోనే ఇరాన్ను తన గుప్పిట్లో పెట్టుకున్నారు.


