News January 25, 2025
రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: జనగామ కలెక్టర్

రైతు భరోసా పథకం కింద కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం వచ్చిన రైతులు, ఇంతకు ముందే పాసు పుస్తకం కలిగి ఉండి కూడా దరఖాస్తు చేసుకోని వారు ఈ నెల 31లోగా ఏఈవోల వద్ద దరఖాస్తు చేసుకోవాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. అలాగే బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకునే వారు సైతం దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో రైతుబంధు పొందిన రైతులు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు.
Similar News
News November 18, 2025
HYD: మిద్దె తోటలతో ఎన్నో ప్రయోజనాలు

HYDలో మిద్దె తోటల పెంపకం జోరందుకుంది. ఈ పద్ధతితో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు పండించుకుని నేచురల్ ఫుడ్ తీసుకోవచ్చు. మరోవైపు భవన ఉష్ణోగ్రతలు తగ్గతుందని పేర్కొన్నారు. నీటి ఉపయోగం పెద్దగా లేకుండా ఈజీగా ఫ్రెష్గా వండుకోవచ్చని డా.విష్ణు వందన తెలిపారు. ఉద్యానశాఖ నెలలో రెండో శనివారంలో ఒక్కోచోట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.
News November 18, 2025
HYD: మిద్దె తోటలతో ఎన్నో ప్రయోజనాలు

HYDలో మిద్దె తోటల పెంపకం జోరందుకుంది. ఈ పద్ధతితో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు పండించుకుని నేచురల్ ఫుడ్ తీసుకోవచ్చు. మరోవైపు భవన ఉష్ణోగ్రతలు తగ్గతుందని పేర్కొన్నారు. నీటి ఉపయోగం పెద్దగా లేకుండా ఈజీగా ఫ్రెష్గా వండుకోవచ్చని డా.విష్ణు వందన తెలిపారు. ఉద్యానశాఖ నెలలో రెండో శనివారంలో ఒక్కోచోట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.
News November 18, 2025
ప్రధాని, రాష్ట్రపతి పర్యటనపై సమీక్ష: అడిషనల్ DG

బాబా జయంతి వేడుకలకు ప్రధాని, రాష్ట్రపతి పర్యటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అడిషనల్ DG పోలీసు అధికారులకు సూచించారు. పుట్టపర్తిలో సోమవారం రాత్రి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 19న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 22 &23 తేదీల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలువురు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ రాష్ట్రాల నుంచి వీవీఐపీలు వస్తున్న నేపథ్యంలో అందరిని అలెర్ట్ చేశారు.


