News January 25, 2025
పి.గన్నవరం: ఏడుగురు వీఆర్వోలకు షోకాజ్ నోటీసులు

పి.గన్నవరం మండలం మండలంలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి ఏడుగురు వీఆర్వోలకు ఎమ్మార్వో శ్రీపల్లవి శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణా నిలువరించడంలో నిర్లక్ష్య వైఖరి కారంణంగా ఈ నోటీసులు జారిచేసినట్లు పేర్కొన్నారు. పి.గన్నవరం, ఎల్.గన్నవరం, మానేపల్లి, మొండిపులంక, బెల్లంపూడి, ఊడిమూడి, జి.పెదపూడిలంక గ్రామాలకు చెందిన రెవెన్యూ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని వెల్లడించారు.
Similar News
News November 6, 2025
చేతులు మెరిసేలా..

కొందరిలో ముఖం ప్రకాశవంతంగానే ఉన్నా.. చేతులు మాత్రం జీవం కోల్పోయినట్లుగా తయారవుతాయి. దీనికోసం ఉప్పుతో తయారుచేసిన స్క్రబ్ని ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కొద్దిగా ఉప్పులో లావెండర్ నూనె కలిపి దాన్ని చేతులకు రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత మృదువుగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటిస్తే చేతులపై చేరిన మృతకణాలు, మురికి తొలగిపోయి మృదువుగా మారతాయి.
News November 6, 2025
WGL: క్వింటా పసుపు రూ.11,738

చాలా రోజుల అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్కు గురువారం పసుపు తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా పసుపుకు రూ.11,738 ధర వచ్చింది. అలాగే మొక్కజొన్న సైతం తరలిరాగా రెండు రోజులతో పోలిస్తే ధర భారీగా పడిపోయింది. సోమవారం మక్కలు (బిల్టీ) క్వింటాకి రూ.2,095, మంగళవారం రూ.2,055 ధర వస్తే.. ఈరోజు రూ.2,010 కి పతనమైంది. అలాగే దీపిక మిర్చి రూ.15,500 ధర వచ్చింది.
News November 6, 2025
తెలంగాణ న్యూస్ అప్డేట్స్ @2PM

*రేపు జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ ఈ నెల 12కు వాయిదా
*హైదరాబాద్ బోరబండలో బండి సంజయ్ కార్నర్ మీటింగ్కు అనుమతి రద్దు చేశారంటూ బీజేపీ నేతల ఆందోళన.. సభ జరిపి తీరుతామని స్పష్టం
*జూబ్లీహిల్స్లో 3 పార్టీల మధ్య గట్టి పోటీ ఉందన్న కిషన్ రెడ్డి
*ఫిరాయింపు MLAలు తెల్లం వెంకట్రావు, సంజయ్లను నేడు విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్


