News January 25, 2025

నంద్యాలలో రూ.8కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి ఫరూక్

image

తెలుగుదేశం పార్టీ గెలిచిన ఆరు నెలల్లోనే నంద్యాలలో రూ.8కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించామని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయాన్ని తొలిసారిగా సందర్శించిన ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించి పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. నంద్యాలను అన్ని విధాలా అభివృద్ధి చేసి తీరుతామని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు.

Similar News

News January 13, 2026

నెల్లూరు వాసికి కీలక పోస్టింగ్

image

నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూరుకు చెందిన ఏటూరు భాను ప్రకాష్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా 2004 నుంచి అక్కడ పనిచేస్తున్నారు. డిప్యుటేషన్‌పై మన రాష్ట్రంలోనూ కొంతకాలం విధులు నిర్వర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో నెల్లూరు జిల్లా వాసి పదవి పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం.

News January 13, 2026

జిల్లాల పునర్విభజన ఇప్పుడు సాధ్యం కాదా?

image

TG: జిల్లాల పునర్విభజన చేపడతామన్న ప్రభుత్వ నిర్ణయానికి దేశవ్యాప్త జనగణన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. 2027 MAR 1 నుంచి జరిగే ఈ ప్రక్రియ నేపథ్యంలో జిల్లాల సరిహద్దులు ఇప్పట్లో మార్చొద్దని గతంలో కేంద్రం సూచించింది. దీనివల్ల జనగణనలో ఇబ్బందులు ఏర్పడి, జిల్లాలవారీ లెక్కలు తీయడం సాధ్యం కాదని చెప్పింది. మరి పునర్విభజనకు ప్రభుత్వం రెండేళ్లు ఆగుతుందా? లేదంటే ఎలా ముందుకెళ్తుంది? అనేది ఆసక్తికరం.

News January 13, 2026

చిత్తూరు: చర్చిలో సంక్రాంతి వేడుకలు

image

చిత్తూరు జిల్లా నగరిలోని సీఎస్ఐ ఈస్ట్ చర్చిలో ముందస్తు సంక్రాంతి వేడుకలను సోమవారం నిర్వహించారు. ప్రెస్ బ్రైటర్ రెవరెండ్ టి.రాజప్రభు ఆధ్వర్యంలో చర్చిని రంగవల్లులు, చెరకు గడలు, పొంగలి కుండలతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు. సంక్రాంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాలు కలగాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత సామరస్యాన్ని చాటి చెప్పేలా వేడుకలు చేశారని పలువురు పేర్కొన్నారు.