News January 25, 2025

శ్రీ సత్యసాయి జిల్లా రౌండప్

image

☞ నేడు ‘మెము’ రైలు రద్దు
☞ మోసం కేసులో కదిరిలో ఇద్దరి అరెస్ట్
☞ అంతర్జాతీయ జూడో పోటీలకు చిగిచెర్ల విద్యార్థి
☞ కదిరి జాబ్ మేళాలో 62మందికి ఉద్యోగాలు
☞ రిపబ్లిక్ ఉత్సవాలకు లేపాక్షి విద్యార్థి సాయి కిరణ్‌కు ఆహ్వానం
☞ జాగ్రత్త: పెనుకొండలో సచివాలయ ఉద్యోగినంటూ మోసాలు
☞ క్వింటా రూ.7,550లతో చిగిచెర్లలో కందుల కొనుగోలు

Similar News

News November 6, 2025

యుగయుగాలకు ఆదర్శం ‘శ్రీరాముడి పాలన’

image

సత్య యుగంలో అంతా మంచే ఉన్నా, త్రేతా యుగంలోని రామ రాజ్యమే చరిత్రలో నిలిచింది. దీనికి కారణం శ్రీరాముని గొప్ప గుణాలు, ఆదర్శవంతమైన పాలన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చూపిన రాజధర్మం సుపరిపాలనకు చిరునామాగా నిలిచింది. ఒక గొప్ప వ్యక్తి రాజుగా ఉంటే, రాజ్యం ఎంతటి ఉన్నత శిఖరాలను చేరుతుందో రామరాజ్యం రుజువు చేసింది. అందుకే, యుగాల తరబడి ఆ పాలనను ఆదర్శంగా చెప్పుకుంటారు. ‘రామరాజ్యం’ అని పోల్చుతుంటారు.

News November 6, 2025

ఈ పంటలకు నారు పెంచి ప్రధాన పొలంలో నాటుకోవాలి

image

తీగజాతి కూరగాయలు అయినటువంటి చిక్కుడు, ఫ్రెంచ్ చిక్కుడు, బెండ, గోరు చిక్కుడు, మునగ లాంటి కూరగాయ పంటలలో విత్తన పరిమాణం పెద్దదిగా ఉంటుంది. కాబట్టి వీటిని నారుగా కాకుండా విత్తనాలను నేరుగా పొలంలోనే విత్తుకోవచ్చు. టమాట, వంగ, క్యాబేజి, కాలిఫ్లవర్, మిరప, ఉల్లి లాంటి పంటలలో విత్తన పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. అందుకే వీటిని ముందుగా నారుమడులలో పెంచుకొని ఆ తర్వాత ప్రధాన పొలంలో నారును నాటుకోవాల్సి ఉంటుంది.

News November 6, 2025

JGTL: మందార పువ్వుపై పున్నమి నిండు చంద్రుడు

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మందార పుష్పంపై పున్నమి నిండు చంద్రుడు దీపం ఆకారంలో ప్రకాశిస్తున్నట్లుగా దర్శనమిచ్చాడు. అయితే కార్తీక పౌర్ణమి రోజున కొన్ని ఆలయాల్లో ఆకాశదీపాలను వెలిగిస్తారు. ఈ నేపథ్యంలో ధర్మపురి క్షేత్రంలో మందారం పువ్వుపై చంద్రుడు కిరణాలు ప్రకాశిస్తూ ఆకాశదీపాన్ని తలపించింది. SHARE IT.