News January 25, 2025
భైరవపట్నంలో అగ్ని ప్రమాదం

మండవల్లి మండలంలోని భైరవపట్నం , ప్రత్తిపాడు స్టేజీ వద్ద నివాసముంటున్న పిట్టలోళ్ల గుడిసెలు ప్రమాదవశాత్తు శుక్రవారం రాత్రి దగ్ధమయ్యాయి. 30 గుడిసెలలోని 25 కుటుంబాల వాళ్లు నిరాశ్రయులయ్యారు. దోమల నివారణకు వెలిగించిన నిప్పు ప్రమాదానికి కారణమైందని భావిస్తున్నారు. స్థానికులు గాయపడ్డ పది మందిని కైకలూరు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News July 4, 2025
దేశ వ్యతిరేక పోస్టులపై కఠిన చర్యలు?

దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ క్రియేట్ చేసే వారికి చుక్కలు చూపించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్ర హోంశాఖ కొత్త పాలసీని రూపొందిస్తున్నట్లు సమాచారం. వెబ్సైట్లు, సోషల్ మీడియాలో పెట్టే కంటెంట్ను పరిశీలించి, దేశ వ్యతిరేక పోస్టులను గుర్తించేందుకు ఓ టీమ్ను ఏర్పాటు చేయనుంది. ఆయా అకౌంట్లను బ్లాక్ చేయడంతో పాటు పోస్ట్ చేసిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.
News July 4, 2025
రైల్వే లైన్, జాతీయ రహదారిపై కలెక్టర్ సమీక్ష

కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అలైన్మెంట్, నర్సాపురం బైపాస్ జాతీయ రహదారి ఏర్పాటుపై కలెక్టర్ మహేశ్ కుమార్ శుక్రవారం సమీక్షించారు. అమలాపురం కలెక్టరేట్లో ఆయన మాట్లాడారు. రైతుల నుంచి ఇంతవరకు సేకరించిన రైల్వే లైన్ భూముల సరిహద్దులో ఫెన్సింగ్ లేదా స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు. రైల్వే, జాతీయ రహదారులు, రెవెన్యూ అధికారులతో భూసేకరణలో ఇప్పటి వరకు సాధించిన పురోగతిపై చర్చించారు. జేసీ నిశాంతి పాల్గొన్నారు.
News July 4, 2025
నిర్మల్ పోలీసుల రికార్డ్.. 21 రోజుల్లో 76 ఫోన్లు రికవరీ

నిర్మల్ జిల్లా పోలీసులు రికార్డ్ సృష్టించారు. 21 రోజుల్లో పోగొట్టుకున్న 76 మొబైల్ ఫోన్లను ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సుమారు రూ.9.12 లక్షల విలువైన ఈ ఫోన్లను రికవరీ చేశామని, గతంతో పోలిస్తే రికవరీ శాతం గణనీయంగా పెరిగిందని ఎస్పీ తెలిపారు. మొబైల్ పోయినా, చోరీకి గురైనా ప్రజలు www.ceir.gov.in పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.