News January 25, 2025
MNCL: మద్యం తాగి.. వాహనాలు నడిపిన నలుగురికి జైలు: ట్రాఫిక్ CI

ఇటీవల మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన 33 మందిని శుక్రవారం మంచిర్యాల సెకండ్ అడిషనల్ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా సివిల్ జడ్జి నిరోషా 29 మందికి రూ.65,500 జరిమానా, నలుగురికి 5 రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆయన సూచించారు.
Similar News
News November 5, 2025
జగిత్యాల: కిటకిటలాడుతున్న ఆలయాలు

జగిత్యాల జిల్లా కేంద్రంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచి భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉసిరిక చెట్టు వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు అర్చకులకు కార్తీక పౌర్ణమి సందర్భంగా దీప దానాలు చేశారు.
News November 5, 2025
భీమదేవరపల్లి: NSS వాలంటీర్ల శ్రమదానం

భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ ఏ.కె.వి.ఆర్. కళాశాల NSS వాలంటీర్లు బుధవారం శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయ ఆవరణలో పరిశుభ్రత పనులు చేపట్టారు. అలాగే, ముస్తాపూర్, చంటయ్యపల్లి గ్రామాలకు వెళ్లే బాటల మరమ్మతులు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ భూపతి శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 150 మంది వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
News November 5, 2025
ఎన్కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా మరికల్ అడవుల్లో పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.


