News January 25, 2025
‘అన్నమయ్య జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’

జంప్ డిపాజిట్ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా పోలీసులు సూచించారు. ‘మీకు తెలియని వ్యక్తుల నుంచి గూగుల్ పే, ఫోన్పేకు కొంత డబ్బు వచ్చిందని సైబర్ నేరగాళ్లు మీకు మెసేజ్ పంపిస్తారు. మనం ఆ డబ్బు నిజంగా వచ్చిందేమో అనుకొని టచ్ చేసి తిరిగి పంపించామో, మనం మోసపోయినట్టే. అమౌంట్ వచ్చినట్లు మీకు కనపడితే వెంటనే తప్పుడు పిన్ను ఎంటర్ చేయండి. ఇలా చేస్తే మోసపోరు’ అని సూచించారు.
Similar News
News January 1, 2026
నల్గొండ: జానారెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల జానారెడ్డి మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. హైదరాబాద్లోని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. బుధవారం సీఎం వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
News January 1, 2026
OP సిందూర్కు రాముడే ఆదర్శం: రాజ్నాథ్

ఆపరేషన్ సిందూర్కు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ‘రాముడి లక్ష్యం కేవలం రావణుడిని చంపడమే కాదు.. అధర్మాన్ని అంతం చేయడం. మేం కూడా ఉగ్రవాదులకు, వాళ్లను పెంచి పోషిస్తున్న వారికి గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా OP సిందూర్ చేపట్టాం’ అని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమాల్లో రామ జన్మభూమి ఉద్యమం ఒకటని, 5 దశాబ్దాలకు పైగా కొనసాగిందని పేర్కొన్నారు.
News January 1, 2026
మామిడి తోటల్లో పూత రాలేదా? ఏం చేయాలి?

ప్రస్తుతం మామిడి చెట్లలో కొన్నింటికి పూత మొగ్గలు కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల మాత్రం ఎలాంటి పూత కనిపించడం లేదు. దీని వల్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. చలి తీవ్రత, పొగ మంచు, ఇతర అంశాలు ఈ పరిస్థితికి కారణం అంటున్నారు నిపుణులు. మామిడిలో మంచి పూత రావాలంటే ఏం చేయాలి? నీరు అందించడంలో జాగ్రత్తలు, తేనె మంచు, బూడిద తెగులు కనిపిస్తుంటే ఎలాంటి మందులు పిచికారీ చేయాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


