News January 25, 2025
నేడు బీజేపీలోకి కరీంనగర్ మేయర్ సునీల్ రావు

కరీంనగర్ నగరంలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. శుక్రవారం నగర మేయర్ యాదగిరి సునీల్ రావు బీఆర్ఎస్కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శనివారం (నేడు) మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక SBS ఫంక్షన్ హాల్లో KNR ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరుతున్నట్లు మేయర్ సునీల్ రావు ప్రకటించారు. ఇక మేయర్ తో పాటు బీజేపీలో ఎవరెవరు చేరుతారు అనేది ఆసక్తిగా మారింది.
Similar News
News March 13, 2025
ఉండవెల్లి: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య.!

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన మధు(21) అనే యువకుడు జోగులాంబ రైల్వే స్టేషన్ సమీపంలోని కర్నూలు వైపు వెళ్లే రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు ఓ పెళ్ళికి వెళ్లి తన అన్న వాసుకు కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఆత్మహత్య గల వివరాలు తెలియాల్సి ఉంది.
News March 13, 2025
పెద్దపల్లి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా బోధన: విద్యాశాఖ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా బోధనపై వీడియో కాన్ఫరెన్స్ను విద్యాశాఖ కార్యదర్శి నిర్వహించారు. మార్చి 15 నుంచి జిల్లాలలో ఎంపికచేసిన ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ)ను వినియోగిస్తూ సులభతరంగా విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ ఆదేశించారు. 3-5వ తరగతి విద్యార్థులకు సామర్థ్యాల పెంపు లక్ష్యం అన్నారు. VCలో PDPL కలెక్టర్ పాల్గొన్నారు.
News March 13, 2025
IPL: హ్యారీ బ్రూక్పై రెండేళ్ల నిషేధం

ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్పై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన ఐపీఎల్లో రెండేళ్లు ఆడకుండా నిషేధం విధించింది. దీంతో బ్రూక్ ఐపీఎల్ ఆడే అవకాశం లేదు. 2028 ఐపీఎల్లో మాత్రమే ఆడే ఛాన్స్ ఉంది. కాగా ఇటీవల ఐపీఎల్ 2025 నుంచి తప్పుకుంటున్నట్లు బ్రూక్ ప్రకటించారు. దీంతో ఐపీఎల్ రూల్ ప్రకారం సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే రెండేళ్ల నిషేధం విధిస్తారు.