News January 25, 2025

నరసరావుపేట: బాలికల వసతి గృహంలో అధికారుల విచారణ 

image

నరసరావుపేట ఎస్సీ కళాశాల బాలికలహాస్టల్ లో విద్యార్థిని గర్భం దాల్చి, రక్తస్రావంతో వైద్యశాలలో చికిత్స పొందుతున్న వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ కుమిదిని, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శివనాగేశ్వరరావు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జోత్స్న హాస్టల్లో విచారణ చేపట్టారు. చదువుకుంటున్న విద్యార్థిని (16) ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

Similar News

News September 19, 2025

టీడీపీలోకి మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

image

AP: మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు చిలకలూరిపేటకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. మాజీ మంత్రి విడదల రజినితో విభేదాల కారణంగా ఇప్పటికే ఆయన వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజశేఖర్ వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్‌గానూ పనిచేశారు.

News September 19, 2025

HYD: ఇరిగేషన్ అనుమతులు ఇంకెప్పుడు?

image

HYD శివారు ప్రతాపసింగారంలో రైతులు 131 ఎకరాలు LPS కింద ప్రభుత్వానికి ఇచ్చారు. ఇందులో HMDA లేఅవుట్ వేసి రైతులకు- HMDAకు 60:40 నిష్పత్తిలో పంపిణీ చేయనుంది. అయితే భూమి ఇచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా ఇరిగేషన్ శాఖ అనుమతులు రాలేదు. ఇటీవల సీఎం రేవంత్ అధికారులను హెచ్చరించిన వారిలో చలనంలేదు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చినా అనుమతులు నిలువరించడంపై రైతులు మండిపడుతున్నారు. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

News September 19, 2025

ADB: పత్తి కొనుగోళ్లకు కొత్త యాప్..!

image

పత్తి కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించడానికి కేంద్రం కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. కనీస మద్దతు ధరకు పంటను విక్రయించేందుకు ‘కపాస్ కిసాన్’ యాప్‌ను తెచ్చింది. రైతులు యాప్‌లో OTPతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత స్లాట్ బుక్ ఆప్షన్ ఉంటుంది. దానిని ఎంచుకోవాలి. తర్వాత భూమి వివరాలు నమోదు చేసి స్లాట్ వివరాలు చెక్ చేసుకోవాలి. ఉమ్మడి ADBలో 5 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగవుతోంది.