News January 25, 2025

రేపు వైన్ షాపులు, మాంసం దుకాణాలు బంద్

image

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో రేపు వైన్ షాపులు, మాంసం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ రోజు రాత్రి నుంచి ఎలాంటి జంతువులను వధించరాదని, అన్ని చికెన్, మటన్, చేపల మార్కెట్లు రేపు మూసివేయాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చాలా పట్టణాల్లో ఇవే తరహా ఆదేశాలు జారీ అయ్యాయి.

Similar News

News November 3, 2025

పెట్టుబడులు రాకుండా YCP కుట్రలు: మంత్రి లోకేశ్

image

AP: రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా YCP కుట్రలు చేస్తోందని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. అన్ని కుట్రలు ఛేదించి సరైన టైమ్‌లో వాస్తవాలను బయటపెడతామన్నారు. ‘అభివృద్ధి కోసం ముందుకొస్తే కలిసికట్టుగా ముందుకెళ్దాం. పెట్టుబడులకు YCP సిఫార్సులను అంగీకరిస్తాం. ఆ పార్టీ సిఫార్సు చేసిన పెట్టుబడులకు వారికే క్రెడిట్ ఇస్తాం. ఎలక్షన్స్ టైమ్‌లోనే రాజకీయాలు.. తర్వాత రాష్ట్రాభివృద్ధే ధ్యేయం’ అని స్పష్టం చేశారు.

News November 3, 2025

‘చక్ దే ఇండియా2’ తీయాలని డిమాండ్.. కారణమిదే

image

18 ఏళ్ల కిందటి ‘చక్ దే ఇండియా’ గుర్తుందా? ప్లేయర్‌గా గెలవని హాకీ వరల్డ్ కప్‌ను కోచ్‌గా కబీర్ ఖాన్(షారుఖ్) సాధించడమే కథ. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని డిమాండ్లు వస్తున్నాయి. మహిళల WC సాధించడంలో కోచ్ అమోల్ మజుందార్‌‌ది కీలక పాత్ర. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 11 వేల రన్స్ చేసినా ఆయన ఇంటర్నేషనల్ డెబ్యూ చేయలేదు. కోచ్‌గా తన కల నెరవేర్చుకున్న అమోల్ కథతో చక్ దే2 తీయాలని నెటిజన్లు కోరుతున్నారు. మీరేమంటారు?

News November 3, 2025

CII సమ్మిట్‌లో రూ.2లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు: మంత్రి లోకేశ్

image

AP: ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ‘సమ్మిట్‌కు 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. 410కి పైగా ఒప్పందాలు జరగనున్నాయి. వీటి విలువ రూ.2లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఈ ఒప్పందాల వల్ల 9లక్షల మందికి పైగా ఉద్యోగాలు పొందుతారు. స్వదేశీ పెట్టుబడుల సాధనలో ఏపీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది’ అని ప్రెస్‌మీట్‌లో వివరించారు.