News March 18, 2024

కామారెడ్డి: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మహిళ మృతి

image

మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట గ్రామానికి చెందిన మరాఠీ లక్ష్మి (42) పని నిమిత్తం మాచారెడ్డికి వచ్చినట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో మాచారెడ్డి ఊర చెరువులో ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News April 3, 2026

NZB: ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలి: కవిత

image

ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలని, ఇందు కోసం అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఫీజుల పెంపుతో ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల తల్లితండ్రులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ఒకేసారి 30-40 శాతం ఫీజులు పెంచి తల్లితండ్రులను ఆగం చేస్తున్నారన్నారు. ఏటా 8 శాతానికి మించి ఫీజు పెంచటాన్ని ప్రభుత్వం నిరోధించాలన్నారు.

News April 2, 2026

నిజామాబాద్: విజయవంతమైన గ్రామ, వార్డు సభలు

image

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామపంచాయతీలు,146 వార్డుల్లో నిర్వహించిన గ్రామ, వార్డు సభలు విజయవంతమయ్యాయి. కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేసి, అవసరమైన సౌకర్యాలు కల్పించారు.

News April 2, 2026

NZB: గ్రామ సభలో CM ఫోటో లేదు

image

సాధారణంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, గ్రామసభలు జరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల ఫోటోలు ఉండటం ప్రొటోకాల్‌లో భాగం. అయితే గురువారం నగరంలోని 15వ డివిజన్‌లోని అర్సపల్లిలో నిర్వహించిన గ్రామసభ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడంతో పాటు MIM చీఫ్ అసదుద్దీన్ ఫోటో ఉండడంతో అది స్థానిక రాజకీయ వర్గాల్లో, ప్రతిపక్షాల మధ్య వివాదానికి దారితీసింది.