News January 25, 2025
ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వం: బండి

TG: ఇందిరమ్మ ఇళ్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులిస్తామన్నారు. అలాగే కాంగ్రెస్ ఫొటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమని, తామే ముద్రించి ప్రజలకు కార్డులు జారీ చేస్తామని స్పష్టంచేశారు. కాగా రాష్ట్రానికి 20లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని CM రేవంత్ కోరారు.
Similar News
News December 29, 2025
JAN 1 నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు

AP: కొత్త జిల్లాలు మార్కాపురం, మదనపల్లె(అన్నమయ్య), రంపచోడవరం JAN 1నుంచి అమలులోకి వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ‘పెనుకొండను వాసవి పెనుకొండగా మార్చేందుకు ఆమోదించాం. రాజంపేటను కడపలో, రైల్వే కోడూరును తిరుపతిలో, మండపేటను రాజమండ్రిలో, అద్దంకిని ప్రకాశంలో కలపనున్నాం. గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెంతో కలిసి మార్కాపురం జిల్లా ఏర్పాటుకానుంది’ అని తెలిపారు.
News December 29, 2025
Money Tip: స్మార్ట్ సేవింగ్.. ఖర్చుకి చెక్!

శాలరీ రాగానే కొంత భాగాన్ని వేరే సేవింగ్స్ అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్లేలా సెట్ చేసుకోండి. దీనివల్ల మెయిన్ బ్యాలెన్స్లో డబ్బు తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి, అనవసర ఖర్చులు తగ్గించుకోవచ్చు. ‘ముందు పొదుపు-తర్వాతే ఖర్చు’ అనే పద్ధతి అలవడుతుంది. చేతిలో డబ్బు ఉంటే ఎలాగోలా ఖర్చయిపోతుంది. ఇలా ఆటోమేటిక్గా పక్కన పెడితే పెద్ద మొత్తంలో డబ్బు సేవ్ అవుతుంది. ఇది ఒక డిజిటల్ పిగ్గీ బ్యాంక్ లాంటిదన్నమాట!
News December 29, 2025
అదరగొట్టిన హంపి, అర్జున్.. మోదీ, CBN ప్రశంస

FIDE వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో తెలుగు తేజాలు కోనేరు హంపి, అర్జున్ ఎరిగైసి అదరగొట్టారు. దోహాలో జరిగిన ఈ టోర్నీలో హంపి మహిళల విభాగంలో, అర్జున్ ఓపెన్ విభాగంలో కాంస్య పతకాలు సాధించారు. ఇది భారత్కు గర్వకారణమని PM మోదీ పేర్కొన్నారు. వారి పట్టుదల, అంకితభావం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రపంచ వేదికపై తెలుగు ఆటగాళ్ల ప్రతిభను చంద్రబాబు ప్రశంసించారు.


