News January 25, 2025
పుష్కరాల పనులు పూర్తి చేయాలి: BHPL కలెక్టర్

ఏప్రిల్ 30 వరకు సరస్వతి పుష్కారాల పనులన్నీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో సరస్వతి పుష్కారాలు, ఫిబ్రవరిలో నిర్వహించనున్న కుంభాభిషేకం కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని పనులను సమర్థవంతంగా పూర్తి చేయడం ద్వారా పుష్కారాలకు వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News September 16, 2025
పెద్దపల్లి: ‘మైక్రో బ్రూవరీ నోటిఫికేషన్ రద్దు చేయాలి’

రామగుండం కార్పొరేషన్లో మైక్రో బ్రూవరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా AIYF PDPL జిల్లా సమితి మంగళవారం జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసింది. మద్యం వల్ల యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని, ఇప్పటికే బెల్టు షాపులు, వైన్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రో బ్రూవరీ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని AIYF నాయకులు హెచ్చరించారు.
News September 16, 2025
నిర్మల్: ‘రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి’

పట్టణంలోని ప్రభుత్వ మాత, శిశు ఆసుపత్రిని కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మహిళా శక్తి క్యాంటీన్ను పరిశీలించిన కలెక్టర్, భోజనం నాణ్యత, పరిశుభ్రతపై వివరాలు సేకరించారు. అనంతరం లాబొరేటరీ, స్కానింగ్ కేంద్రం, ఇన్వార్డు, అవుట్వార్డు, ఆపరేషన్ థియేటర్, ఓపి వార్డు, బాలింతల వార్డులను సందర్శించి రోగుల పరిస్థితి స్వయంగా పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.
News September 16, 2025
గుండెపోటుతో డోన్ ఆర్పీఎఫ్ ఎస్ఐ మృతి

డోన్ రైల్వే స్టేషన్లో విషాదం నెలకొంది. ఆర్పీఎఫ్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ నాయక్ గుండెపోటుతో మృతిచెందారు. సామాజిక సేవలోనూ ముందుండే లక్ష్మణ్ నాయక్ మరణ వార్త కుటుంబ సభ్యులు, సహచరులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తోటి సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.