News January 25, 2025
కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం చెప్పలేదు: చంద్రబాబు

AP: గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టమంటూ బీఆర్ఎస్ నేత <<15250698>>హరీశ్ రావు<<>> చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘బనకచర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు. వరద జలాలను మాత్రమే తరలిస్తాం. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మిస్తే మేం అభ్యంతరం చెప్పలేదు’ అని వెల్లడించారు. అటు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు.
Similar News
News December 31, 2025
GRSEలో 107 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ &ఇంజినీర్స్ లిమిటెడ్ (<
News December 31, 2025
Happy New Year

భారతదేశం మరో 8.30గంటల్లో 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. కానీ రిపబ్లిక్ ఆఫ్ కిరిబాటి ద్వీపం పరిధిలోని క్రిస్టమస్ ఐలాండ్ ఇప్పటికే 2026లోకి వెళ్లిపోయింది. భారత కాలమానం ప్రకారం అక్కడ 3:30pmకు నూతన సంవత్సరం ప్రారంభమైంది. 7500 సగటు జనాభా ఉండే ఈ ద్వీప సమూహం ప్రపంచంలోని అత్యంత రిమోట్ ఐలాండ్స్లో ఒకటి. కాసేపట్లో న్యూజిలాండ్ సమీపంలోని కొన్ని ప్రాంతాల్లోనూ న్యూ ఇయర్ మొదలవనుంది.
News December 31, 2025
ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదు: ఎంపీ భరత్

AP: వచ్చే ఎన్నికల్లో తాను భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారాన్ని విశాఖ ఎంపీ శ్రీభరత్ ఖండించారు. ఓ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉంటూ ఎమ్మెల్యే పదవికి తాను జస్టిస్ చేయలేనన్నారు. ఎంపీగానే పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రెస్మీట్లో స్పష్టం చేశారు. ఒకవేళ భరత్ భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తాను విశాఖ ఎంపీ స్థానానికి బరిలో నిలిచేందుకు సిద్ధమని MLA గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


