News January 25, 2025

NGKL: కుష్ఠు వ్యాధి అవగాహన అవసరం: స్వరాజ్యలక్ష్మి

image

స్పర్శలేని కుష్ఠి వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి అన్నారు. జిల్లా కలెక్టర్ సమావేశ హాల్లో వైద్యాధికారులు, కుష్ఠు వ్యాధి నోడల్ అధికారులు ఈనెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు స్పర్శ లేని కుష్ఠు వ్యాధిపై అవగాహన ఉద్యమం నిర్వహించాలని సూచించారు. ప్రజలు ఈ వ్యాధి (స్పర్శ లేని మచ్చ)పై అవగాహనతో వారే స్వయంగా డాక్టర్ను సంప్రదించాలన్నారు.

Similar News

News November 15, 2025

సిర్పూర్ (టీ): యాజమాన్యం పిటిషన్‌కు యూనియన్ కౌంటర్

image

సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ (ఈ-966) ఎన్నికలను అడ్డుకునేందుకు జేకే యాజమాన్యం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయడానికి యూనియన్ వకాలతును అడ్వకేట్ ఎం. శంకర్‌కు అందజేసింది. ఎన్నికలను అడ్డుకోవడం దుర్మార్గమని వైస్ ప్రెసిడెంట్ గోగర్ల కన్నయ్య విమర్శించారు. యాజమాన్యం ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదని, వెంటనే పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

News November 15, 2025

తిరుపతి: 11వ సీటులోకి లగేజీ ఎలా వచ్చిందో..?

image

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి బయల్దేరిన TTD మాజీ AVSO స‌తీష్ కుమార్ మధ్యలో చనిపోయిన విషయం తెలిసిందే. A1 భోగిలోని 29వ నంబర్ సీటును సతీశ్ కుమార్ బుక్ చేసుకోగా 11వ నంబర్ సీట్ వద్ద ఆయన లగేజీ లభ్యమైంది. శుక్రవారం ఉదయం 6.23 గంటలకు ఆ రైలు తిరుపతికి చేరుకున్నప్పుడు బెడ్ రోల్ అటెండర్‌ రాజీవ్ రతన్ లగేజీ గుర్తించి అధికారులకు అందజేశారు. వేరే సీట్లోకి లగేజీ ఎలా వచ్చిందనే దానిపై విచారణ కొనసాగుతోంది.

News November 15, 2025

వాహనదారులకు అవగాహన కల్పించండి: SP

image

రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గించవచ్చని నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల సూచించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ తగు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.