News January 25, 2025

విశాఖ: పురుగు మందు తాగి తల్లీ కూతురు మృతి

image

తగరపువలస ఆదర్శనగర్లో ‌విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. భార్యాభర్తల గొడవతో మనస్తాపం చెందిన వివాహిత శనివారం మాధవి (25)ఇద్దరు కుమార్తెలతో పాటు పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తల్లితో పాటు చిన్న కుమార్తె రతిక్ష మృతి చెందింది. మృతిరాలి భర్త రామకృష్ణ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగంమని పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News January 23, 2026

మురికివాడల రహిత నగరంగా విశాఖ

image

మురికివాడల రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు GVMC ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మురికివాడలు ఎక్కడుంటే అక్కడే ఇళ్లు నిర్మించేలా ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఎన్ని ఇళ్లు నిర్మించాలన్నది సర్వే చేసి DPR తయారుచేయనున్నారు. ఇప్పటికే దీనిపై మంత్రి నారాయణ, కమిషనర్ కేతన్ గార్గ్ మురికివాడలను సందర్శించారు. నగరంలో దాదాపు వందకు పైగా మురికివాడలు ఉన్నాయి. దశల వారీగా వీటిని అభివృద్ధి చేయనున్నారు.

News January 23, 2026

GVMC కౌన్సిల్ సమావేశం.. 15 అంశాల ఎజెండా

image

ఈనెల 30న జరిగే GVMC కౌన్సిల్ సమావేశంలో 15 అంశాలతో ఎజెండాను తయారు చేశారు. మేయర్ పిలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే సమావేశం ఉ.11 గంటలకు ప్రారంభం కానుంది. ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి గీతం యూనివర్సిటీ బదలాయింపు, క్రమబద్దికరించే అంశాన్ని ఎజెండాలో పొందుపరిచారు. GVMC ఉద్యోగుల సర్వీస్ అంశం, సింహాచలం తొలిపంచ జంక్షన్ వద్ద జంక్షన్ వద్ద రూ1.25 కోట్ల అభివృద్ధి పనులు వీటిలో కలవు.

News January 23, 2026

మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి విశాఖ పర్యటన

image

జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయస్వామి ఈనెల 24, 25వ తేదీల్లో విశాఖలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు.
శనివారం ఉదయం విశాఖ చేరుకుని దస్పల్లా హోటల్లో బస చేస్తారు. సాయంత్రం ఆర్‌కే బీచ్ వద్ద నిర్వహించే విశాఖ ఉత్సవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం నగర పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం విశాఖ నుంచి ప్రకాశం జిల్లాకు తిరుగుపయనమవుతారు.