News January 25, 2025
నకిలీ నోట్ల ముఠా పట్టుకున్న సిబ్బందికి నగదు రివార్డు అందించిన సీపీ

కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ నోట్ల ముఠాను పట్టుకొని నిందితుల నుంచి పెద్ద మొత్తంలో అసలు, నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా నిలిచిన కానిస్టేబుల్ శ్యాంరాజ్, హోంగార్డ్ రాజేందర్ను సీపీ అంబర్ కిషోర్ ఝా అభినందిచి నగదు రివార్డులను అందజేశారు. విధి నిర్వహణ ప్రతిభ కనబరిచిన సిబ్బంది శాఖ పరమైన గుర్తింపు లభిస్తుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.
Similar News
News January 16, 2026
జనగామ: గాదె ఇన్నయ్యకు తాత్కాలిక బెయిల్ మంజూరు

జనగామ జిల్లా జాఫర్గఢ్కు చెందిన గాదె ఇన్నయ్యకు తాత్కాలిక బెయిల్ మంజూరైంది. మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఇంట్లో విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆయన తల్లి థెరిసమ్మ గురువారం రాత్రి మరణించారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గాదె ఇన్నయ్యకు కోర్టు 48 గంటల బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదల కానున్నారు.
News January 16, 2026
రేపు మేడారం ట్రస్ట్ బోర్డు ఛైర్పర్సన్ ప్రమాణస్వీకారం

మేడారం ట్రస్ట్ బోర్డ్ ఛైర్పర్సన్గా తాడ్వాయి మండలానికి చెందిన ఈర్పా సుకన్యను ప్రభుత్వం నామినేట్ చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు మేడారంలోని సమ్మక్క భవన్లో ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News January 16, 2026
జగిత్యాల కలెక్టరేట్లో విద్యా ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

జగిత్యాల సమీకృత కలెక్టరేట్లో TGMREIS ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల పోస్టర్ను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ టి. సుచిత్ర పాల్గొని, అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


