News January 25, 2025
నకిలీ నోట్ల ముఠా పట్టుకున్న సిబ్బందికి నగదు రివార్డు అందించిన సీపీ

కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ నోట్ల ముఠాను పట్టుకొని నిందితుల నుంచి పెద్ద మొత్తంలో అసలు, నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా నిలిచిన కానిస్టేబుల్ శ్యాంరాజ్, హోంగార్డ్ రాజేందర్ను సీపీ అంబర్ కిషోర్ ఝా అభినందిచి నగదు రివార్డులను అందజేశారు. విధి నిర్వహణ ప్రతిభ కనబరిచిన సిబ్బంది శాఖ పరమైన గుర్తింపు లభిస్తుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.
Similar News
News November 4, 2025
సృజనాత్మకతతోనే ఉన్నత విద్య: డీఈవో దక్షిణామూర్తి

విద్యార్థులు తమలో సృజనాత్మకతను పెంచుకోవాలని డీఈవో దక్షిణామూర్తి అన్నారు. బయ్యారంలోని ఎంపీపీఎస్ పాఠశాలను తనిఖీ చేసిన ఆయన, విద్యార్థులకు కొత్త అంశాలపై నిరంతరం అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. హాజరు వివరాలు, విద్యార్థుల విద్యాసామర్థ్యాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం బాలు, ఉపాధ్యాయులు సంధ్యారాణి, రూప్ల నాయక్ తదితరులు పాల్గొన్నారు.
News November 4, 2025
అమరావతికి రూ.32,500 కోట్ల అదనపు రుణాలు

అమరావతి రాజధాని నగరం అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ సహా ఆర్థిక సంస్థల నుంచి భారీగా రుణాలు అందనున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి ₹14,000 కోట్లు రుణం అందే అవకాశం ఉంది. దీనితో పాటు, నాబ్ఫిడ్ నుంచి ₹10,000 కోట్లు, నాబార్డు నుంచి ₹7,000 కోట్లు రానున్నాయి. ఈ కొత్త నిధులతో కలిపి, సీఆర్డీఏకు ₹58,500 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. CRDA ఇప్పటికే ₹91,639 కోట్ల విలువైన 112 నిర్మాణ పనులను చేస్తోంది.
News November 4, 2025
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<


