News January 25, 2025

ఒకే నెలలో కొండగట్టు ఆలయానికి ముగ్గురు ఈవోలు

image

కొండగట్టు అంజన్న ఆలయ ఈఓగా ఇవాళ ఉప కమిషనర్ కృష్ణ ప్రసాద్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇదే నెలలో ముగ్గురు కొండగట్టు ఈఓలుగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. ఇక్కడి ఈఓ రామకృష్ణ బదిలీపై వెళ్లగా వేములవాడ ఈఓ వినోద్ రెడ్డికి అదనపు బాధ్యతలు కల్పించారు. తర్వాత శ్రీకాంత్ రావు వరంగల్ ను నియమిస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయగా, బాధ్యతలు చేపట్టి సెలవుపై వెళ్ళారు. దీంతో కృష్ణ ప్రసాద్‌ను నియమించారు.

Similar News

News November 12, 2025

శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేయాలి: ఎస్పీ

image

శాంత్రిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీలేకుండా పనిచేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. కేసుల ఛేదనకు టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులపై అలసత్వం వహించకుండా బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని ఆదేశించారు.

News November 12, 2025

బాబర్ ఖాతాలో చెత్త రికార్డు

image

పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజం ఫ్లాప్ షో కొనసాగుతోంది. సెంచరీ చేయకుండా అత్యధిక వన్డేలు ఆడిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ(83)ని సమం చేశారు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ ప్లేయర్ జయసూర్య(88) తొలి స్థానంలో ఉన్నారు. వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ చందర్‌పాల్(78) వీరి తర్వాతి స్థానంలో ఉన్నారు. నిన్న SLతో జరిగిన మ్యాచులో బాబర్ 51 బంతుల్లో 29 పరుగులు చేశారు. చివరగా 2023 ఆసియాకప్‌లో నేపాల్‌పై సెంచరీ బాదారు.

News November 12, 2025

జూబ్లీహిల్స్: కాంగ్రెస్ VS BRS.. పోలీసులకు తలనొప్పి..!

image

ప్రతిష్ఠాత్మకమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం పలు చోట్ల ఉద్రిక్తల నడుమ సాగింది. కాంగ్రెస్, BRS నేతలు నువ్వానేనా అన్నచందంగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చారు. నినాదాలు, నిరసనలు, బైఠాయింపులు, వాగ్వాదాలు, అరెస్ట్‌లతో పాటు చివరకు PSలలో పరస్పరం ఫిర్యాదులు చేసేదాకా ఇరు పార్టీల నాయకులు వెళ్లారు. దీంతో వీరి వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారగా ఇరు పార్టీల నేతలపై కేసులు నమోదు చేశారు.