News January 25, 2025
ఆ విషయానికి వస్తే అంతా ఒక్కటే

రాజకీయ పార్టీల మధ్య ఎన్ని సిద్ధాంత భేదాలున్నా, అన్నింటికీ సక్సెస్ మంత్ర మాత్రం ఉచితాలే. ఢిల్లీ ఎన్నికలే చూస్తే.. అవినీతిని ఊడ్చేస్తామనే ఆప్, ఫ్రీబీస్ ప్రమాదకరమన్న BJP సహా అన్నీ ఫ్రీ హామీలు ఇవ్వడంలో తగ్గడం లేదు. ప్రజల జీవితాలు మారుతాయో లేదో తెలియదు కానీ ప్రతిసారి హామీలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అంతా అదే తారకమంత్రం అని జపిస్తుంటే ప్రజల జీవితాలు వికసించేదెప్పుడు? దేశం అభివృద్ధి చెందేది ఎప్పుడు?
Similar News
News November 10, 2025
హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా ప్రకటించాలా?

దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గాలి పీల్చలేక వేల మంది అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేయాలని మరోసారి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అక్కడ శుభ్రమైన గాలితో పాటు కనెక్టివిటీ బాగుంటుందని వివిధ రాష్ట్రాల నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని పలు కేంద్ర కార్యాలయాలను హైదరాబాద్కు తరలించాలంటున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 10, 2025
భాగ్యనగరంలో ₹304 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి

TG: భాగ్యనగరానికి మరో ఐకానిక్ వంతెన రానుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా మీర్ ఆలం ట్యాంక్ వద్ద ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. ₹304 కోట్లతో శాస్త్రిపురం నుంచి చింతల్మెట్ మీదుగా బెంగళూరు NHని కలుపుతూ దీన్ని నిర్మించనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు CM ప్రాధాన్యమివ్వడం తెలిసిందే. కాగా HYDలో దుర్గం చెరువుపై గతంలో కేబుల్ బ్రిడ్జి నిర్మించారు.
News November 10, 2025
ఏం జరిగినా పవన్ నోరు మెదపరు ఎందుకు: శ్యామల

AP: జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగినా CM రాజీనామా చేయాలన్న పవన్ ఇప్పుడు నోరు మెదపట్లేదని YCP నేత శ్యామల విమర్శించారు. ‘మీ ప్రభుత్వంలో ఎన్నో హత్యలు, నకిలీ మద్యంతో ప్రాణాలు పోతున్నా అది ప్రభుత్వ వైఫల్యం కాదు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ తొక్కిసలాటల్లో భక్తులు మరణిస్తే కిక్కురు మనకూడదు. విశాఖలో 2లక్షల KGల గో మాంసం దొరికినా నోరు మూసుకొని ఉండాలి. దీనిపై పవన్గారి స్పందన ఏంటో మరి’ అని ప్రశ్నించారు.


