News January 26, 2025

NGKL: టీచర్‌ను సస్పెండ్ చేసిన డీఈవో

image

నాగర్ కర్నూల్ జిల్లా బాల్మురు మండలంలోని కొండానాగుల గ్రామంలోని జడ్పీ పాఠశాలలో విద్యార్థులపై చెప్పులతో దాడి చేసిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ డీఈవో రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని తెలిపారు. విద్యార్థులపై దాడి ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది.

Similar News

News September 15, 2025

కేంద్రానికి రూ.100 చెల్లిస్తే మనకి ఎంత తిరిగి వస్తుందంటే?

image

రాష్ట్రాలు పన్ను రూపంలో కేంద్రానికి చెల్లించే ప్రతి రూ.100లో తిరిగి ఎంత పొందుతాయో తెలుసా? అత్యల్పంగా మహారాష్ట్ర రూ.100 పన్నులో ₹6.8 మాత్రమే తిరిగి పొందుతోంది. అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్ ₹4278.8 తీసుకుంటుంది. ఆర్థిక సంఘం సూత్రాల ఆధారంగా జనాభా, ఆదాయ అసమానత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పంపిణీ చేస్తారు. TGకి ₹43.9, APకి ₹40.5 వస్తాయి. వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడటమే దీని ఉద్దేశ్యం.

News September 15, 2025

ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకున్న కడెం ప్రాజెక్టు

image

నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న కడెం ప్రాజెక్టు నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం ఆనాటి ఇంజినీర్ల నైపుణ్యానికి నిదర్శనం. 1949లో నిర్మాణం ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లు ఉన్నాయి. 1995, 2022, 2023వ సంవత్సరాల్లో ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద వచ్చినప్పటికీ పటిష్టంగా నిలబడింది. ఇది నాటి ఇంజినీర్ల పనితీరు, దూరదృష్టికి నిలువుటద్దంలా కనిపిస్తోంది.

News September 15, 2025

జగిత్యాల జిల్లాలో యువకుడి దారుణ హత్య

image

జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట శివారులో ఆదివారం రాత్రి యువకుడి హత్య కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన యువకుడు నహీముద్దీన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.