News January 26, 2025

నల్లగొండ: MGU మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో జనవరి 30 నుంచి జరగాల్సిన పీజీ లా & ఎంసీఏ పరీక్షలను ఫిబ్రవరి 8 నుంచి నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన పోటీ పరీక్షల కారణంగా అకడమిక్ పరీక్షల కోసం సమాయత్తానికి కొంత సమయం కావాలంటూ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

Similar News

News January 16, 2026

నిర్మల్: సదర్మాట్ బ్యారేజీ నిర్మాణానికి 1176 ఎకరాల సేకరణ

image

సదర్మాట్ బ్యారేజీ ద్వారా ఉమ్మడి ADB, NZB, KNR జిల్లాల రైతులకు సాగునీరు అందనుంది. 1.58 TMCల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మొత్తం 1176 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో NRML జిల్లాలో 805, JGTL జిల్లాలో 317 ఎకరాలు ఉన్నాయి. ఈ బ్యారేజీ ద్వారా 13,210 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు, JGTL జిల్లాలోని 4,896 ఎకరాలకు నీరు అందుతుంది. బ్యాక్ వాటర్ ద్వారా NZB జిల్లా లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం కలగనుంది.

News January 16, 2026

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం

image

శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ల ఉదంతం కలకలం రేపింది. ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో దోహా వెళ్లేందుకు సిద్ధమైన 8 మంది ప్రయాణికుల టికెట్లు నకిలీవని తేలాయి. ఈ నకిలీ టికెట్ల వెనుక ఏవరైనా ఏజెంట్ల హస్తం ఉందా? లేదా ట్రావెల్ ఏజెన్సీల మోసమా? అనే కోణంలో శంషాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

News January 16, 2026

ఎమోషన్స్‌ను బయటపెట్టాల్సిందే..

image

ప్రతిమనిషికీ భావోద్వేగాలు ఉంటాయి. వివిధ పరిస్థితులను బట్టి అవి బయటకు వస్తాయి. కానీ కొందరు తమకు కోపం, భయం, బాధ వస్తే వాటిని లోలోపలే తొక్కిపెట్టేస్తుంటారు. అవి తలనొప్పి, కడుపు సమస్యలు, గుండెదడ, నిద్రలేమి, అజీర్తి వంటి శారీరక సమస్యల రూపంలో అవి బయటకు వస్తాయంటున్నారు సైకాలజిస్టులు. ప్రతిఒక్కరూ తమలోని ఎమోషన్స్‌ని సన్నిహితులతో పంచుకోవాలని, అలా కుదరకపోతే సైకాలజిస్ట్ సాయం తీసుకోవాలని చెబుతున్నారు.