News March 18, 2024

కడప పార్లమెంట్ TDP అభ్యర్థిగా వీర శివారెడ్డి.?

image

కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గండ్లూరు వీరశివారెడ్డి బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కడప పార్లమెంటులోని ప్రజలకు అధిష్ఠానం ఐవీఆర్ సర్వే ద్వారా ఫోన్లు చేస్తోంది. సర్వేలో ఎంపీ అభ్యర్థిగా వీరశివారెడ్డితో పాటు మరికొందరి పేర్లను ప్రస్తావించగా.. వీరశివారెడ్డి వైపే మొగ్గుచూపినట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇక్కడినుంచి వాసు టికెట్ ఆశిస్తుండగా ఎవరికి దక్కుతుందో చూడాలి

Similar News

News May 8, 2025

పెండ్లిమర్రిలో రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

image

పెండ్లిమర్రి మండలంలోని కొత్తూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను వేంపల్లి శ్రీరాంనగర్‌కు చెందిన బాలయ్య, రాజీవ్ నగర్‌కు చెందిన మల్లికార్జున, మదనపల్లెకి చెందిన మల్లికార్జునగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 8, 2025

పెండ్లిమర్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

పెండ్లిమర్రి మండలం కొత్తూరు వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్‌ను కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరు వేంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 8, 2025

కడప: రిమ్స్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున

image

కడప రిమ్స్ మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కళాశాల సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికి బొకేలు అందజేశారు. రిమ్స్ మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.