News January 26, 2025

సిద్దిపేట: ఖైదీలు తమ హక్కులను తెలుసుకోవాలి: జడ్జి

image

ఖైదీలు తమ హక్కులను తెలుసుకోవాలని సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమాదేవి తెలిపారు. జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా జైలులో ఏర్పాటు చేసిన లీగల్ అవెర్నెస్ కార్యక్రమానికి జడ్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఆర్థిక స్థితి లేని ఖైదీలు ఉచితంగా ప్రభుత్వ పరంగా లాయర్‌లను పెట్టుకోవచ్చని సూచించారు.

Similar News

News November 15, 2025

GNT: రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు

image

రైతులకు ధాన్యం విక్రయాన్ని సులభం చేస్తూ కొత్త వాట్సాప్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇకపై 7337359375 నంబర్‌కు “Hi” పంపితే వెంటనే సేవలు అందుబాటులోకి వస్తాయి. రైతులు అమ్మదలచిన ధాన్య రకం, బస్తాల సంఖ్య, దగ్గర్లోని కేంద్రం, తేదీ-సమయం వివరాలు పంపగానే స్లాట్ ఆటోమేటిక్‌గా బుక్ అవుతుంది. ధాన్యం అమ్మకాల్లో ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు చేసే దిశగా ఈ చర్య ముందడుగుగా రైతులు భావిస్తున్నారు.

News November 15, 2025

శాశ్వతమైన ఆనందానికి మార్గం ఏదంటే..?

image

అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరమ్ |
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ ||
ఆరంభం, అంతం లేనివాడు, సకల లోకాలకు మహేశ్వరుడు, సమస్త ప్రపంచానికి అధిపతి అయిన మహావిష్ణువును నిత్యం స్తుతించి, ధ్యానించే భక్తుడు సమస్త దుఃఖాలను దాటి మోక్షాన్ని పొందుతాడు. శ్రీమన్నారాయణుడిని నిరంతరం స్మరించడమే మనకు శాశ్వతమైన శాంతి, ఆనందాన్ని ప్రసాదించే దివ్య మార్గం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 15, 2025

GWL: రబీ సీజన్‌కు సాగునీరు ఇవ్వలేం- డిప్యూటీ సీఎం

image

కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర డ్యాం పరిధిలోని ఆయకట్టుకు రబీలో సాగునీరు ఇవ్వలేమని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం బెంగళూరులో జరిగిన సాగు నీటి సలహా మండలి సమావేశంలో విషయాన్ని వెల్లడించారు. తుంగభద్ర డ్యాంకు కొత్త క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీబీ డ్యాం పరిధిలోని ఆయకట్టు రైతులు సహకరించాలన్నారు. అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు.