News January 26, 2025
ఓయూలో బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును మార్చి 4వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 6వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News January 14, 2026
టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

సికింద్రాబాద్, RKపురంలోని <
News January 14, 2026
మోసపోయిన డైరెక్టర్ తేజ కుమారుడు

డైరెక్టర్ తేజ కుమారుడు అమితోవ్ తేజ భారీ మోసానికి గురయ్యారు. ట్రేడింగ్లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి హైదరాబాద్కు చెందిన దంపతులు రూ.63 లక్షలు కాజేశారనే ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. షేర్మార్కెట్ నిపుణులమంటూ పరిచయం పెంచుకున్న అనూష, ప్రణీత్ దంపతులు ఫేక్ ప్రాఫిట్స్ చూపించి నమ్మించారు. లాభాలు రాకపోగా పెట్టిన డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో అమితోవ్ పోలీసులను ఆశ్రయించారు.
News January 14, 2026
WGL: పుర పోరులో మహిళా ఓటర్లదే పైచేయి!

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తం 3,35,244 మంది ఓటర్లలో మహిళలు 1,72,087 మంది ఉండగా, పురుషుల సంఖ్య 1,63,088గా నమోదైంది. పురుషుల కంటే 8,999 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. భూపాలపల్లి మినహా మిగిలిన అన్ని పురపాలికల్లో మహిళలదే పైచేయిగా ఉంది. జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీ అయిన మహబూబాబాద్లోనూ మహిళా ఓటర్లే 2,571 మంది ఎక్కువగా ఉండటం విశేషం.


