News January 26, 2025
HYD: ఒక కిలోమీటర్ మెట్రోకు రూ.317 కోట్లు..!

HYD మెట్రో ప్రాజెక్టు ఫేజ్-2లో పార్ట్-A కింద 5 మెట్రో కారిడార్ల డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు (DPR) సిద్ధమైనట్లు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. 76.4KM మెట్రోకు రూ.24,269 కోట్ల ఖర్చు అవుతుందని రిపోర్టులో ఉంది. అంటే సుమారు 1KM మెట్రోకు రూ.317 కోట్లు.ఈ ప్రాజెక్టు రిపోర్టులను కేంద్రం ఆమోదించాలని,కేంద్ర,రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించడానికి నిధులు విడుదల కేటాయించాలని కోరారు.
Similar News
News November 9, 2025
ఈనెల 11న ములుగులో ‘ఐక్యత పాదయాత్ర’

‘ఏక్ భారత్ – ఆత్మ నిర్భర భారత్’ నినాదంతో ఈ నెల 11న ఉదయం ములుగులో జిల్లా స్థాయి ఐక్యత పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు. యువతలో దేశభక్తి, ప్రజల్లో సమైక్యతను పెంచేందుకు ఈ యాత్రను చేపట్టారు. ఉదయం 9:30 గంటలకు ఫారెస్ట్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు జరిగే ఈ పాదయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
News November 9, 2025
వేములపల్లిలో ఉరేసుకుని వివాహిత మృతి

ఉరివేసుకుని వివాహిత మృతి చెందిన ఘటన ఆదివారం ద్వారపూడి శివారు వేములపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం. ముమ్మిడివరం (m) సోమదేవరపాలెంకు చెందిన మట్టా రేఖ (24) వేములపల్లిలో పాకలో ఉరివేసుకుని మృతి చెందింది. వేములపల్లిలో తండ్రి ఇంటికి 4నెలల క్రితం కాన్పుకోసం వచ్చింది. ఫోన్లో ఆమె భర్త వేణుతో గొడవ పడినట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.
News November 9, 2025
పేకాట శిబిరంపై దాడి.. రూ.68,920 సీజ్: సీఐ

కురుపాం మండలం సింగుపురం సమీపంలో పేకాట శిబిరంపై సీఐ బి.హరి ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 12 మందిని పట్టుకొని వారి వద్ద ఉన్న రూ.68,920 సీజ్ చేశామని సీఐ తెలిపారు. పట్టుబడినవారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఎస్సైలు నారాయణరావు, శివప్రసాద్, పోలీస్ సిబ్బంది


