News January 26, 2025

అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం

image

AP: అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు ACA అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. ‘అహ్మదాబాద్ స్టేడియం(1.10 లక్షల సీటింగ్)కంటే పెద్దదిగా అమరావతి స్టేడియం(1.25లక్షల సీటింగ్) ఉంటుంది. 60 ఎకరాల్లో రూ.800 కోట్ల వ్యయంతో దీనిని నిర్మిస్తాం. అమరావతిలో 200 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేస్తాం. 2027కల్లా IPLకు ఏపీ నుంచి 15 మంది ఎంపికయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

Similar News

News November 16, 2025

వైసీపీపై చట్టపరమైన చర్యలు: జనసేన

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్ పేషీలో లేని సురేశ్ అనే వ్యక్తి పేషీలో పనిచేస్తూ అవినీతికి పాల్పడినట్లు YCP తప్పుడు ఆరోపణలు చేసిందని జనసేన మండిపడింది. YCPపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు Xలో పోస్ట్ చేసింది. ‘పవన్ కళ్యాణ్ నిబద్ధత, పారదర్శకతపై అనుమానం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేసిన వారిపై, వాటిని ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాం’ అని పేర్కొంది.

News November 16, 2025

మెంటార్‌ని ఎంచుకుంటున్నారా?

image

మీరు రాణించాలనుకొనే రంగంలో సీనియర్లను మెంటార్‌గా ఎంచుకొనే ముందు వారు నిజంగా మీకు మార్గం చూపించడానికి తగిన వారేనా అన్నది గుర్తించాలి. వారిలో ఏ అంశం మిమ్మల్ని ప్రభావితం చేస్తుందో గమనించాలి. అపజయాలు పొందిన వాళ్లనీ మార్గదర్శకుడిగా ఎన్నుకుంటే వారి తప్పుల గురించి తెలుసుకోవచ్చు. మెంటార్ శభాష్ అని వెన్ను తట్టడమే కాకుండా, తప్పు చేస్తున్నప్పుడు నిర్మొహమాటంగా తగదని మందలించే వారై ఉండాలి.

News November 16, 2025

రేషన్ కార్డు ఉంటేనే..

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంటును పెద్దఎత్తున అనర్హులు పొందుతున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌కమ్ సర్టిఫికెట్ దరఖాస్తుకు రేషన్ కార్డును లింక్ చేసింది. అంటే ఇకపై రేషన్ కార్డు ఉంటేనే ఆదాయ ధ్రువీకరణ పత్రం వస్తుంది. మీసేవ సెంటర్లలో రేషన్ కార్డులు లేని వారు అప్లై చేస్తే ‘మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు’ అని మెసేజ్ వస్తుంది. దీంతో అనర్హులకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.