News January 26, 2025
పెండింగ్ కేసులపై దృష్టి పెట్టండి: ఈస్ట్ జోన్ డీసీపీ

పోలీస్ స్టేషన్ల పరిధిలో పెండింగ్ ఉన్న కేసులు త్వరగా పరిష్కరించాలని ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ అధికారులకు సూచించారు. మామూనూర్ డివిజన్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో డీసీపీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. చోరీలను కట్టడి చేయడం కోసం పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని డీసీపీ స్టేషన్ అధికారులకు సూచించారు.
Similar News
News January 15, 2026
₹2 లక్షలు డిస్కౌంట్.. అయినా కొనేవారు లేరు!

ఇండియాలో గ్రాండ్గా ఎంట్రీ ఇద్దామనుకున్న టెస్లాకు గట్టి షాకే తగిలింది. గతేడాది దిగుమతి చేసుకున్న 300 మోడల్ Y కార్లలో దాదాపు 100 అమ్ముడవక షెడ్డుకే పరిమితమయ్యాయి. ముందే బుక్ చేసుకున్న వారూ ఇప్పుడు వెనక్కి తగ్గుతుండటంతో మస్క్ కంపెనీ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. స్టాక్ను క్లియర్ చేసేందుకు ఏకంగా ₹2 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. భారీ ధరలు, తక్కువ డిమాండ్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది.
News January 15, 2026
కమ్యునికేషన్ లేకపోవడమే గొడవలకు కారణం

ఏం మాట్లాడినా గొడవలవుతున్నాయని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. దీనికి వారి కమ్యునికేషన్ పాటర్న్ కారణమంటున్నారు మానసిక నిపుణులు. ఒకరు ఫీలింగ్స్ గురించి మాట్లాడితే, మరొకరు లాజికల్గా మాట్లాడతారు. ఒకరు ప్రజెంట్ గురించి, మరొకరు పాస్ట్ గురించి డిస్కస్ చేస్తారు. కాబట్టి దేని గురించి డిస్కస్ చేస్తున్నారో ఇద్దరికీ క్లారిటీ ఉండటం ముఖ్యమంటున్నారు. అప్పుడే బంధంలో అపార్థాలకు తావుండదని సూచిస్తున్నారు.
News January 15, 2026
ములుగు: మద్యం తాగొద్దన్నందుకు సూసైడ్

జిల్లాలోని మంగపేటలో<<18854819>> మీసేవ నిర్వాహకుడు వీర కిశోర్<<>> బుధవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఎస్సై సూరి వివరాలు.. మృతుడు కొంత కాలంగా మద్యానికి బానిసై, భార్య ఎన్ని సార్లు మందలించిన వినకుండా నిత్యం మద్యం తాగేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. కాగా, కిశోర్ ఇక నుంచి మద్యం తాగానని చెప్పాడని, బుధవారం ఉదయం చూసేసరికి వేరే గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


