News January 26, 2025

NLG: KCR హయాంలోనే HAPPY: మాజీ MLA

image

మాజీ సీఎం KCR హయాంలోనే సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరసనలు, అరెస్టులు, ప్రజాపాలన గ్రామసభల దరఖాస్తుల పేరుతో ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా ప్రజల పక్షాన పోరాడుతామని తెలిపారు. 

Similar News

News July 4, 2025

దివ్యాంగులకు ఉపకరణాల దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌ఛార్జి టీడబ్ల్యూఓ శిరీష తెలిపారు. దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా 2025-26 ఆర్థిక సం.రానికి శారీరక వైకల్యం ఉన్నవారికి, అంధులకు మానసిక దివ్యాంగుల సహాయార్థం రెట్రోఫీటెడ్ మోటర్ వెహికల్స్, బ్యాటరీ వీల్ చైర్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్, అందజేయనున్నట్లు తెలిపారు. వివరాలకు tsobmms.cgg.gov.in వెబ్‌సైట్ చూడాలన్నారు.

News July 4, 2025

భారత్‌కు డ్రాగన్ బిగ్ వార్నింగ్

image

టిబెట్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని భారత్‌ను చైనా హెచ్చరించింది. దలైలామా వారసుడి ఎంపిక నిర్ణయం టిబెట్ చూసుకుంటుందని, ఇందులో ఇండియా తలదూర్చకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది.

News July 4, 2025

నిర్మల్: ‘విద్యార్థుల వివరాలను త్వరగా నమోదు చేయండి’

image

నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో వివిధ స్కాలర్‌షిప్‌లు పొందుతున్న విద్యార్థుల వివరాలను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు త్వరగా నమోదు చేయాలని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు శుక్రవారం తెలిపారు. నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ స్కీంలో భాగంగా ఈ సంవత్సరం జిల్లా నుంచి 54 మంది ఎంపికయ్యారన్నారు. వీరందరి వివరాలను ఎన్‌ఎస్‌పీ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.