News January 26, 2025
NLG: KCR హయాంలోనే HAPPY: మాజీ MLA

మాజీ సీఎం KCR హయాంలోనే సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరసనలు, అరెస్టులు, ప్రజాపాలన గ్రామసభల దరఖాస్తుల పేరుతో ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా ప్రజల పక్షాన పోరాడుతామని తెలిపారు.
Similar News
News October 23, 2025
కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రతికూల పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై కీలకంగా చర్చిస్తున్నారని సమాచారం. ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలిచిన కొండా సురేఖ సైతం క్యాబినెట్ భేటీకి హాజరయ్యారు.
News October 23, 2025
ఉయ్యూరు: బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్ట్

ఉయ్యూరులో 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన షేక్ చాన్ బాషా (30)ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు తెలిపారు. చాక్లెట్ల ఆశ చూపి చిన్నారిని తన గదిలోకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని చాకుతో బెదిరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు.
News October 23, 2025
మహిళలూ బండిపై ప్రయాణిస్తున్నారా..ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఈ బిజీ ప్రపంచంలో మహిళలు కూడా నిత్యం వాహనాలు నడపడం తప్పనిసరైంది. అయితే ఈ సమయంలో ప్రమాదాలు నివారించడానికి కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. బండి నడిపేటపుడు చీర కొంగు, చున్నీ ఎగరకుండా బిగించి కట్టుకోవాలి. లేదంటే చక్రాలకు శారీగార్డు ఏర్పాటు చేసుకోవాలి. హెల్మెట్ వాడటం తప్పనిసరి. పిల్లలతో ప్రయాణించేటపుడు టూ వీలర్ బేబీ బెల్ట్, ఛైల్డ్ క్యారియర్ వాడటం వల్ల ప్రమాదాల తీవ్రత తగ్గుతుంది.