News January 26, 2025

‘హథిరాంజీ మఠం కూల్చివేతను అడ్డుకుంటాం’

image

ప్రాణాలను అడ్డుగా పెట్టి తిరుపతి గాంధీ రోడ్డులోని హథీరాంజీ మఠాన్ని కాపాడుకుంటామని టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి అన్నారు. తిరుపతిలోని మఠాన్ని శనివారం సాయంత్రం టీడీపీ నాయకులు పరిశీలించారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాలు కోసం పురాతనమైన మఠాన్ని కూల్చివేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. మఠం భవనాల కూల్చివేతతో రూ.కోట్ల నష్టం వస్తుందని చెప్పారు.

Similar News

News December 30, 2025

CETs తేదీలు ఖరారు.. చెక్ చేసుకోండి

image

తెలంగాణలో ఉన్నత విద్య కోర్సుల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ వెల్లడయ్యాయి. ఇంజినీరింగ్, ఫార్మా అనుబంధ కోర్సుల అడ్మిషన్లకు గల EAPCET 2026 మే 4- 11 తేదీల మధ్య ఉంటుందని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇక MBA/MCA ప్రవేశాల కోసం ICETను మే 13, 14 తేదీల్లో B.Ed ఎంట్రన్స్ టెస్ట్ EDCETను మే 12న నిర్వహిస్తామని తెలిపింది. మిగతా పరీక్షల షెడ్యూల్, నిర్వహించే యూనివర్సిటీల వివరాలు పై ఫొటోలో వివరంగా పొందండి.
Share It

News December 30, 2025

మోహన్‌లాల్ తల్లి కన్నుమూత

image

మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ తల్లి శాంతాకుమారి(90) కన్నుమూశారు. కేరళలోని కొచ్చిలో ఆమె తుదిశ్వాస విడిచారు. శాంతాకుమారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. మోహన్‌లాల్‌కు సానుభూతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

News December 30, 2025

గరుడ గమన తవ విష్ణు స్తోత్రం రాసింది ఎవరో తెలుసా.?

image

ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవాలయాలలో గరుడ గమన తవ.. చరణ కమల మిహా మనసిత సతు మల నిత్యం.. మహతాపము మా పా కురుదేవ.. మహా పాపమ మా పా కురుదేవ స్తోత్రం విస్తృతంగా వినపడుతుంది. ఈ మహా విష్ణు స్తోత్రాన్ని శృంగేరి శంకరమఠం పీఠాధిపతి జగద్గురు శ్రీ భారతి తీర్థానంద స్వామి రచించారు. స్వామిజి పల్నాడు జిల్లాకు చెందినవారు. స్వామీజీ పల్నాడు జిల్లాలోనే విద్యాభ్యాసం చేశారు. ఇప్పటికీ నరసరావుపేటలో శృంగేరి శంకర మఠం ఉంది.